26, ఆగస్టు 2013, సోమవారం

ఆంధ్రా లో సమైక్య హింస నుండి కాపాడే దేవుడా కే సి ఆర్ ?



న్యూస్ పేపర్స్ సమైక్య ఉదయం తీవ్రత గురించి అంతా ఇంతా కాదని చెప్తోంటే ఏమిటో అనుకొన్నాం గాని , ఒక్కో కధ వింటుంటే నవ్వు వస్తుంది. వీళ్ళకి ఆవేశం వచ్చి బందులు చేస్తుంటే సామాన్యజనం పట్టించుకోవట్లేదని ఉద్యమకారులు తీవ్రంగా పగ బట్టేసారు.  ముందు ఊర్లకి బస్సులు ఆపేశారు. కచ్చితంగా తెలిసి చస్తుంది ఇక అనుకొన్నారు కాని, బస్సులు వచ్చినా రాకపోయినా సగమందికి పెద్ద లెక్క కాదు, ఇక షాపులు మూయించి పడేసారు . నెలకొకసారి కొనుక్కునే జీవులు కాదుగా కాస్త చిరాకు పడ్డారు కాని, అదేన్నాల్లు లే, గవర్మెంట్ ఉద్యోగం కాదుగా కిరాణా కొట్టు . ఏదో బస్సుల్లేవు కాబట్టి పక్కోరికేల్లి కొనుక్కోలేరులే అని నాలుగు రోజులు కొట్టు కట్టేసి కావాల్సిన నాలుగు రకాలు వండుకొని సుష్టుగా తిని రెస్టు తీసుకొన్న దుకాణు దారులు మళ్ళీ విధుల్లోకి అదేనండీ వ్యాపారం లోకి వచ్చేసారు. ఇక ఆటోల వాళ్ళపై పది ఎడుస్తున్నారట బాగు పడి పోతున్నారని , వాళ్ళకీ ఉపాయం తట్టింది రోజుకో కూడలి దగ్గర ఒక్కో గ్రూప్ బంద్  పాటిస్తారు, మిగిలినవాళ్ళు బంద్  పండగ పుణ్యమా అని నాలుగు రాళ్ళు వెనకేసుకునే హడావుడి మామూలే .

రోగాలకి ట్రీట్మెంట్ తీసుకొనే వాళ్లకి ఆటోల ఖర్చులు అదనం కాక, అసలు గమ్యం చేరుతారో లేదో తెలియదు . ఇంకొందరికేమో  బీరువా నిండా చీరలున్నా పాడు బందు షాపింగ్ కి కూడా వెళ్ళలేకపోతున్నాం అని దిగులు జ్వరం పట్టికుంది కాని ప్రచారంలో ఉన్నట్లోల్ అయ్యో అయిదరబాదు  పోతుందే అన్న బెంగ మాత్రం లేదంటే నమ్మండి .

ఇది చాలదన్నట్లు కాస్త పెళ్ళిళ్ళు ఫంక్షన్ల సీజనాయే . అక్కడా ఖాళీ కుర్చీలు వెక్కిరిస్తున్నాయట . అంటే

ఇదికాక సచ్చినోళ్ళు ఇంకో రెండ్రోజుల్లో కరెంట్, నీళ్ళు కూడా ఆపెస్తారంటా అని ఫోన్ లో చెప్తుంటే పకాల్న నవ్వొచ్చింది. పాపం ఈ గొడవేమో గాని జనాలు టీవీలకు అతుక్కు పోయారు. మా పిన్ని చెప్తున్నారు, వాడు  డి ల్లీ పొయ్యాడు ఏం చేత్తాడో అని అంటుంటే, వాడా వాడెవడూ అంటే కే సీ ఆర్ అట . మరి ఈ కరెంటూ, నీళ్ళ కష్టాలు తీర్చడానికి ఆంధ్రలో మనిషే లేనట్టు పాపం సగటు సీమాంధ్ర కేసీఆర్ వైపు ఆశగా చూస్తోంది . వార్నీ వీడింత పాపులర్ అయ్యాడా ఆంధ్రలో అని ముక్కున వేలేసికోవాలి.

ఏదేమైనా అన్ని పార్టీల ఆశలూ ఆంధ్ర పైనే ఉండడం ఇప్పుడు ఆంధ్రులకి శాపం అయ్యింది . ఎక్కడ పక్కోడి  మాటలు నమ్మేస్తారో అని పతోక్కడూ ఉద్యమం మొదలెట్టాడు . ఇప్పుడు దీక్ష చేస్తే వచ్చే మైలేజీ  ఎలక్షన్లో పదికోట్లు పంచినా రాదనీ అర్ధమై పోయింది . అందుకే నాలుగు రోజు కడుపు మాడ్చుకొని ఉద్యమ నేత అయిపోవాలని తపన పడుతున్నారు .

ఇంత  చేస్తున్నా ఆంధ్రులకి ముందుకొచ్చి ఇదేంటి అని అడగాలని తోచదో ఏంటో . కరెంటూ నీళ్ళూ రాకుండా చెయ్యడమేంటి వీళ్ళ తిక్క తగలెయ్య, రాష్ట్రం గబ్బు పట్టి పోతది . 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి