కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యెక తెలంగాణా ను ఈ ఆగస్ట్ 30 న ప్రకటించిన వెంటనే పెద్దగా సీమాంధ్ర నుండి స్పాదన లేకున్నా చిన్నగా బందులు, నినాదాలు మొదలయ్యాయి.
సమైక్య ఉద్యమం కాని, హైదరాబాద్ ఉద్యమం కాని జరగాలి , కాదనే వారెవరూ లెరు. కాని ప్రజల భాగ స్వామ్యం తో జరగాలి , రాజకీయ వర్గాలు నేరుగా పాల్గొనాలి. ఈ సమస్యలో భావ సారూప్యత ఉన్న అన్ని రాజకీయ పార్టీలు సంయుక్తంగా పోరాడాలి. ఇవేవి లేకుండా ఉద్యోగుల ముసుగులో రాజకీయ పార్టీలు జరిపే రచ్చ కాకూదడదు.
కొద్ది మంది ఎన్జీవోలు విధులు బహిష్కరించాల్సింది గా ఇచ్చ్చిన పిలుపు కు దాదాపు తొంబయి శాతం ఉద్యోగులు విదులకి దూరం గా ఉన్నారని సమాచారం , కాని వీరిలో ఎంతమంది సమైక్యవాదులు అని నిర్ధారించడానికి వీలు లేదు. ప్రస్తుతం వీరి నిలజీతాలను ప్రభుత్వం నిలిపివేసింది కాని, రాష్ట్ర విభజన జరిగినా .జరగకున్నా వీరి జీతాలు వీరికి జమ అవుతాయి, రెండు సందర్భాలలోనూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రమె ఉంటుంది కాబట్టి. వీళ్ళని కాదంటే చంద్రబాబుకి పట్టిన గతి పట్టిస్తారు .
కేవలం
ఉద్యోగులు మాత్రమె , సెక్యురిటీ మధ్య వెళ్లివచ్చిన సభ కి ప్రాధాన్యత యెంత?
వారు సీమంధ్ర ప్రజల్లోని సమైక్యవాదులందరూ పాల్గొనాల్సిన అవసరం లేదా? లేక
మిగిలిన ప్రజలు వారి స్థాయికి తగరనుకొన్నారా ?
ఈ మీటింగు కి 'సేవ్ సీమాంధ్ర' అని పెడితే ఇంకాస్త సవ్యంగా, కన్ఫ్యూజన్ లేకుండా ఉండేది .'సేవ్ ఆంధ్రప్రదేశ్' అంటే సమైక్యాంధ్ర అని కాకున్నా పాత రాష్ట్రమే అని వీరి భావన అయ్యుండొచ్చు . ఆంధ్ర ప్రదేశ్ కి ఇప్పుడు రెండురూపాలు ఉన్నాయి , ఒకటి విభజన ప్రకటనకి ముందు మరియు రెండవది తర్వాత . ఈ ఎన్జీవోలకి విభజన తర్వాతి ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు .
వీరు కేవలం విభజన సమయం లో హడావిడి చెయ్యడానికి కెసిఆర్ పుణ్యమా అని రోడ్దేక్కినవారు మాత్రమె . అలాగే సేవ్ సీమాంధ్ర అంటే హైదరాబాదులో ఉన్న సమైక్యవాదులు, ఇంకా హైదరాబాదుతో మాత్రమె పని ఉన్న సమైక్యవాదులు కలవరు . సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ఈ బంద్ కి పూర్తిగా దూరం , ఎందుకంటె కేంద్ర ప్రభుత్వం జీతం చస్తే జమ చెయ్యదు కాబట్టి . ఇదే ఉద్యోగుల సమ్మెలో పెద్ద డొల్లతనం
మొత్తానికి 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకి సీమాంధ్ర కి సంబంధం అసలు లేదా అంటే ... వివరాల్లోకి వెళ్ళాలి
ఎవరో చెప్పినట్లు సభలో ఒక్కో భాగానికి ఒక్కో ప్రముఖుడి పేరు, తెలంగాణా వారితో సహా కలిపి పెట్టగానే సరిపోదు, మాట్లాడే మాటల్లో , చర్చల్లో మొత్తం తెలంగాణా తో కలిపిన ఆంధ్ర ప్రదేశ్ యొక్క మంచి చెడులు ఉండాలి. విభజన వల్ల సమైక్యవాడులనబడే కొద్దిమంది కి వచ్చే నష్టాలను మాత్రమె చర్చించడం హాస్యాస్పదమ్.
ఇందులో తెలంగాణా, సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు, సమస్యలు ఎంతవరకు పరిగణనలోకి తీసికోబడ్డాయి ??? అంటే సమాధానం లేదు . విభజన వల్ల లాభాలు, నష్టాలు రెండూ ఉంటాయి. కేవలం నష్టాలు మాత్రమె చర్చించడం తప్పుకాదు , కాని అటు తెలంగాణా, ఇటు కొంతవరకు సీమాంధ్ర ని వదిలేసి కేవలం ఒక వర్గానికి మాత్రమె పరిమితం అయితే అది సమైక్యాంధ్ర సభ అవుతుందా?
సరే విభజన వల్ల వచ్చే నష్టాలు సాధికారంగా వివరించడానికి తగినట్లుగా అన్ని వర్గాల ఇంజినీర్లు, మేధావులు ప్రసంగించారా? కనీసం సదరు ఎంజీవోలు ప్రజలతో చర్చించారా?
ఈ మాత్రం సభలు సీమాంధ్ర లో ఇంతవరకూ పెట్టలేక పోయారేమి ? వీళ్ళకంత దృశ్యం లేదు , రాజకీయ పార్టీల కూలీలు గా ఉద్యమం చేస్తున్నారు, రాజకీయ నాయకుల్లానే వీరు విస్తృతమైన ప్రయోజనాలగురించి మాట్లాడడం లేదు . అలాగే సమైక్యాంధ్ర లో ఉన్న తెలంగాణా వారి సమస్యల గురించి వీరు చచ్చినట్లు మాట్లాడాల్సిందే , నిజంగా సమైక్యవాదులు అయితె. కాని ముందు చెప్పినట్లు గా వివిధ రాజకీయ వర్గాల తొత్తులు ముందుంది నడిపించిన కార్యక్రమాలకు మాత్రమె వీరు పరిమితం
కే సి ఆర్ పుణ్యమా అని ఎన్జీవో లు పని విరామం ప్రకటించి ఊరికే కూర్చుంటే
విధులకి వెళ్ళాలి కాబట్టి (ఉస్మానియా విద్యార్ధులు కొందరితో పొల్చడం
తప్పవుతుందా?) అక్కడక్కడా గర్జిస్తూ ఈ వారం లో హైదరాబాదులో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' నినాదాన్ని వినిపిస్తూ పెద్ద సభ నిర్వహించారు.
వీళ్ళు ఉద్యమం, ఆందోళన అంటే ప్రజలకి అన్ని ప్రభుత్వ సర్వీసులు నిలిపివేసి , ప్రజలని వేధించడమే అని క్రొత్తగా కనిపెట్టారు.కొన్ని సర్వీసులు సెంట్రల్ గవర్నమెంట్ఆధ్వర్యం లో ఉన్నాయి కాబట్టి జనం కొద్దిగా ఊపిరి పీల్చుకో గలుగుతున్నారు. హైదరాబాదు లో ఒక నెల సమ్మె జరిగితే గగ్గోలుపెడతారు కాని సీమాంద్ర ఉద్యోగులు మొత్తం నెలల తరబడి విధులకు దూరంగా ఉంటె , అక్కడి ప్రజల ఇబ్బందులగురించి అడిగే దిక్కులేదు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి