18, సెప్టెంబర్ 2013, బుధవారం

తెలంగాణా రాదా?



ఈ సమైక్య, తెలంగాణా ఉద్యమాల  గొడవ సంగతేంటి రా శ్రీనూ ....

తెలంగాణా రాదు అక్కా, ఇది మారదు అని ఖచ్చితంగా అని అనేసాడు ...

హ్మ్ , చిత్రంగా  శ్రీను మా ఊర్లో తన ఈడు కుర్రాళ్ళతో పోల్చితే ఉలిపి కట్టె అని చెప్పొచ్చు. మా ఇంటికి తప్ప ఇంకెవ్వరి ఇంటికి వెళ్ళడు కూడా. ఎప్పుడో పాతికేళ్ళ క్రితం  వాళ్ళ నాన్న ఉద్యోగ రీత్యా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. అంటే మా వూరు హైదరాబాద్ అయితే, వీడు అక్కడ సీమాంన్ధ్రుడు అంటే సరిపోతుంది . వీడికి వూర్లో  మా తమ్ముడు తప్ప  మిగిలిన క్లాస్మేట్స్ తెలివితక్కువ దద్దమ్మలు అని బాగా నమ్మకం కాబొలు, కాస్త కూడా లెక్క చెయ్యడు. ఇక వాళ్ళు సరే సరి.


అనుకోకుండా ఈ వారం లో  మాట్లాడాల్సి వచ్చింది, ఆ మాట ఈ మాట అయ్యాక ప్రస్తుతం కాంగ్రెస్ పెద్దలు తెలంగాణా ప్రకటించిన సందర్భంగా , సమైక్యాంధ్ర లో అక్కడక్కడా ఉన్న హదావిదిని ఈనాడు చించి చాటంత చేసి చూపిస్తున్నది  కదా. వాడి అభిప్రాయం తెల్సుకుందామని జస్ట్ అడిగాను అంతే . ఒక్క ముక్క లో తేల్చేసాడు .


అసలు ఈ అపర మేధావిని అడగడానికి కారణం ఉందండోయ్. నాలుగేళ్ల క్రితం చంద్రబాబు మహాకూటమి ని పోగు చేసి సమర శంఖం  పూరించగానే ఇంకేముంది తిరుగులేదు అన్న గట్టి నమ్మకం తో ఎంట్రా సీనూ సంగతీ అని పొరపాటున అడిగాను . అక్కోయ్ పక్కా మళ్ళీ వై ఎస్సే అని ధంకా భజాయించాడు. చా అంత  లేదేమోరా !!! (వీడికి ఊర్లోని మా సామాజిక కులం  కుర్రాళ్ళు అంటే అస్సలు పడదు కాబట్టి చంద్రబాబు ని కర్వేపాకులా  తీసేస్తున్నాడే అని అనుమానం అన్నమాట )


కాదక్కా జనంలో  దీపం పధకం, ఇందిరమ్మ ఇల్లు ఇంకెవో  యజ్ఞాలు లో తెగ ఉబ్బి తబ్బిబ్బయ్యారు , ఇంక వైయెస్సు కి తిరుగే లేదు అని బల్ల విరక్కోట్టేసాడు. అయినా ఇంకోసారి బాబు సంగతిరా అని కాస్త మెత్తగా  అడిగాను.   కాస్త అయినా జాలి దయా లేకుండా తెలుగు బాబు కి మళ్ళీ  చీఫ్ అయ్యే యోగమే లేదక్కా అని చప్పరిన్చేసాడు .


ఆ కారణంబేవిటా  అని ఆరాతీస్తే , మన హైటెక్కు బాబు కి శని గండం పట్టేసిందట . ఏవిటో ఆ శనీశ్వరుడు పోతూ పోతూ దేబ్బేసి పోతాడుట . అలా అలిపిరి లో ఉగ్ర వాదుల దాడి లో  చావు తప్పి  వెంటనే తొందరపడి  సానుభూతి ఓట్ల కోసం ముందస్తు హడావిడి చేసిన తప్పిదం వల్ల  కన్ను లొట్ట పోయిమ్దిటా . అలా కాక మామూలుగా మిగిలినా ఆర్నెల్లు ఆగి ఉంటె గెల్చేసే  వాడే నుట  కాని మరి శని కుదురుగా ఉండనిస్తే కదా .

హతవిధీ మరి టీ డీ పీ ఇక గెలవదా !!!! ( ఇంకా నయ్యం , మా ఇంట్లో ఎవరన్నా ఈ సంభాషణ వింటే వీడికి బడితె పూజే బహుమానం )

అంటే అక్కా  ఇంకెవరన్నా అయితే పార్టీ గెలవచ్చేమో కాని, బాబు ఉంటె మాత్రం కధ  కంచికే అని చావు కబురు చల్లగా వినిపించాడు.

ఎలక్షన్ అయ్యాక తెలుస్తుంది లే , దొరికాం కదా అని నీ జాతకాల పాండిత్యం అంతా వదలకు అన్నా చిరాగ్గా .

అసలు వీడు డిగ్రీ చదవడం మానేసి జాతకాల పుస్తకాలు నమిలేసాడు.  అవి అయ్యాక పూజలు పిచ్చోకటి . ప్రముఖ ఆస్ట్రాలజర్ అని ఫీలయిపోతాడు కూడాను.


ఇంతలో ఎలక్షన్ లో వైఎస్స్ హైదరాబాద్  వీసాల డైలాగ్ కి  బాబుకి మహా బూడిదే మిగిలింది .  అబ్బా మా సీనుగాడు చెప్పినట్లే ఇక బాబు పనయిపోయిందా అని కించిత్ అనుమానం కలిగి కారణాలు పీకి పందిరేస్తే అర్ధం అయ్యింది. కాంగ్రెస్ లో సామూహిక మరియు సమైక్య  అవినీతి కి, బాబు  ఎప్పటికి పోటి ఇవ్వలేడు. అసలు ఇంట్లో వాళ్ళకే దిక్కులేదు . ఇంకెక్కడ అధికారం  చేతికోచ్చేది .

ఇక తెలుగు దేశం ప్రజల ఓట్లు  వెలుగు లో కొచ్చేదేలా అంటే  ఉడిపి హోటళ్ళు.. ఒక రాజకీయ విశ్లేషణ.. ! చదివి తీరాల్సిందే .


ఇప్పుడు వీడు ఏ నమ్మకం తో చెప్పాడో కాని తెలంగాణా రాదు అని , ఈ సీమాంధ్ర ఉద్యోగులంతా కలిసి సీమాన్ధ్రని ఇంకో యాభై ఏళ్ళు ఎనక్కి తీసికేల్లెట్లున్నారు.


ఒక అమ్మకం లేదు , కొనడం లేదు. ఆ చేసేదేదో బంగారం షాపులోల్లతో బందు చేయిస్తే జనం లో ఫాలోయింగు పెరుగుతుంది కాని,  హాస్పిటల్లో ఉన్న పురిట్లో  పసికందులను వరుసగా  పడుకో పెట్టి సమైక్య  ఉద్యమం ని వీధి డ్రామా స్థాయికి దిగజార్చడం ఏమిటో.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి