రాజకీయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రాజకీయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, ఏప్రిల్ 2013, ఆదివారం

కెమెరామెన్ గంగ తో రాంబాబు - జగన్ కధ

పూరీ జగన్ దర్శకత్వం  వహించిన సిన్మా జగన్ కధ కాక త్రివిక్రమ్ కధ  అవుతుందా  అని అనుమానం వచ్చిందా మీకు?  అయితే మీకు జ్ఞాన పీఠం  వచ్చేసినట్లే .

వై ఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫ్లైట్ ఆక్సిడెంట్ లో మరణించిన కొద్ది రోజులకే ఆయన పై సినిమా ని పూరి జగన్ దర్సకత్వం లో ప్లాన్ చేసినట్లుగా హడావిడి చేశారు . మొత్తానికి ముహూర్తం పెట్టడమే తరవాయి అని ప్రచారం కూడా జరిగింది . అప్పట్లో కాస్త దర్శకుడికి సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ కోసం తయారు చేసుకొన్న ముడిసరుకు అలా ఉండిపోయి ఉంటుంది . అదే  కెమెరామెన్ గంగ తో రాంబాబు కి మూల కధ అనుకోవచ్చు. సినిమా చూస్తున్నంత సేపు పూరీ జగన్ వై ఎస్ కుటుంబ అభిమాని కాదా అని బోలెడు ఆశ్చర్యం వేసింది. కేవలం దర్శకుడిగా మాత్రమె కొడుకు జగన్ కి సిన్మా చేస్తానన్నాడా?

గబ్బర్సింగ్ చూసాక పవన్ సిన్మాలంటే చిరాకేసింది . అందుకే ఇప్పటి వరకు ఈ సిన్మా వైపు కూడా చూడలేదు .కాని మన తిరుట్టు వెబ్ సైట్ లో ఇంతకూ మించిన సిన్మా దొరక్క చూడాల్సి వచ్చింది .  ఒకేసారి చూడ్డం  కాస్త కష్టం ఏమో. అదీ కాక ఎంటర్తైన్మెంట్ కోసం సిన్మా అంటే ఇది నచ్చకపోవచ్చు . నాకు మాత్రం చాలా నచ్చింది . మొత్తం పూరిజగను విశ్వరూపం చూపించేసాడు, డైలాగ్స్ వ్రాయడం లోను అవి ఆయా పాత్రలతో చెప్పించడం తోనూ.

సిన్మా లో రాజకీయ పాత్రల పేర్లు చూసి చంద్రబాబు నాయుడు కధలో ఉన్నాడను కొంటే  మళ్ళీ పప్పులో కాలేసినట్లే.
రెడ్డి పేరు పెట్టినంత మాత్రాన , పాద యాత్ర చేసినంత మాత్రం తో ముఖ్య మంత్రి గా వై ఎస్ ని, కేవలం నాయుడు అన్న పేరుతొ ప్రతి పక్ష నాయకుడిని ఊహించుకోవడం చాలా హాస్యాస్పదం . రెండు టర్మ్స్ ముఖ్యమంత్రిగా చేసింది కేవలం చంద్రబాబే కాదు , వై ఎస్ కూడా :)

ఇంతకీ చెప్పొచ్చేదేమంటే అక్కడ నాయకుడు, ప్రతినాయకుడు ఒకే వ్యక్తి కధ  నుండి వచ్చారు . ఇద్దరూ వై ఎస్ గారి కధలోని రెండు కోణాలు .  సమకాలీన రాజకీయ అంశాలు సినిమా కధగా పెట్టినపుడు కాస్త కాచీ గా ఉండే పేర్లు వాడడం , అదీ డైరెక్టు ఇది పలానా ముఖ్యమంత్రి పాత్ర అని స్పష్టంగా అర్ధం కాకుండా ఉండేందుకు పూరి జగన్ చేసిన ప్రయోగం చక్కగా ఫలించింది. ఇంకా తండ్రి చనిపోక ముందే కొడుకు జైలు సీన్ రావడం ముఖ్య మంత్రి అయిపోతాడు అని ప్రచారం జరగడం అలా మనకి తెలిసిన వరుసలో కాకున్నా జగన్ రాజకీయ జీవిత ఘట్టాలన్నీ మనకళ్ళముందు జరిగిపోతూ ఉంటాయి . మనం ఊహించని మలుపులు తో ఆశ్చర్య పరుస్తాయి . ఒక సారి తెలుగు తల్లి ఇంటర్వ్యూ  తోనూ , ఇంకొకసారి టీవీ లో ఆవేశపూరిత  ఉపన్యాసంతో జనం అందరినీ కదిలించడం చాలా బావున్నాయి 

రాజకీయం పక్కన పెడితే , మనోభావాలు దెబ్బ తీసుకొనే ప్రేక్షకులకొసమ్ గుడ్డి వారి పై వేసిన సెటైర్ అదుర్స్. ఇంకా సిన్మా ను వెయ్యిప్రింట్లు వేసి హడావిడిగా డబ్బు చేసికొంటున్న నిర్మాతల్నీ వదల్లేదు . ఇక బ్రహ్మానందం పాత్ర నయితే చాలా ఎంజాయ్ చెయ్యొచ్చు .  తమన్నా మొదటి సారి అమ్మాయిగా నటించింది , అందాల బొమ్మ  గా కాకుండా . తను ఎలాంటి అమ్మాయో చెప్పడం సరదాగా ఉంటుంది . ఆర్డినరీ అమ్మాయిల గురించి  దర్శక జగన్ మాటలు పవన్ డైలాగులలో  చక్కగా పేలాయి .

సుజాత గారు దేశభక్తి సిన్మాల పై వ్రాసిన ఎఫ్ఫెక్ట్ ఈ రాష్ట్ర భక్తి  సినిమా  రివ్యు  నేను వ్రాస్తే వస్తుందా , అయినా పర్లేదు సిన్మా నాకు బాగా నచ్చింది  ఽది పంచుకోవడానికే ఈ బుల్లి టపా అన్నమాట. అవార్డ్ రావాల్సిన సిన్మా , నేను బాగుంది అన్నాక ఏ సిన్మా అయినా ఆడిందా అని అసలు :) ఒక ఆరెంజ్ , ఒక మొగుడు, ఒక కెమెరామెన్ :)  పబ్లిక్ కి నచ్చవ్  :)







18, ఏప్రిల్ 2013, గురువారం

ఆసియా లోని అత్యంత ప్రభావశీలురు వీరేనా


ఈనాడుకి ఈ మధ్య సోనియా పై ప్రేమ ఎక్కువయ్యిన్ది. నకిలీ కణికులా మజాకా :) అబ్బే కాదులే జగన్మాయేమో .   అప్పట్లో చంద్రబాబుగురించి ఇలా అంతర్జాతీయ నంబర్ల హడావిడి జరిగెది.  తర్వాత వార్తల్లో కనిపించడం మానేసాడు. ఇప్పుడు మన్మోహనుకో , సోనియాకో ఎదురు దెబ్బ తగలదు కదా.  వివరాల్లోకి వెళ్తే ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురైన 100 మంది ఆసియన్లలో మొదటి అయిదు మంది లో సోనియా, మన్మోహనూ మరియు రాహులూ రెండవ, నాల్గవ, అయిదవస్తానాల్లో నిలిచారు. సోనియా తల్లి ప్రేమ యెంత గొప్పది, తన పేరోక్కటి కాకుండా కొడుకు కి కూడా ఇప్పిస్తూ అనుమానం రాకుండా ఆటలో అరటి పండు లా మన్మోహనుక్కూడా ఉదారంగా వేయించేశారు.

ఏమాటకామాటే  చెప్పుకొవాలి. ఒక దశాబ్దం క్రిందట జనాలకి ఈ సోనియా పిచ్చేమిటో అర్ధం అయ్యేది కాదు. అందంగా , ఇంత  పెద్ద బొట్టు పెట్టుకొని  పట్టుచీరకట్టుకొఛ్చిన సుష్మా స్వరాజ్ ని వదిలేసి ఈ బళ్లారోళ్ళు సోనియాని గెలిపించేడం  అస్సలు జీర్ణం కాలేదంటే నమ్మండి .అయినా అదే  సుష్మా స్వరాజ్ గుండు కొట్టిన్చుకోకుండా ప్రధాని పదవిని త్యాగం చేసి  భారతీయ సంప్రదాయాన్ని కాపాడింది అనుకోండి.  ఇప్పుడయితే ఆంద్ర, తెలంగాణా లో ఎక్కడ అయినా గెలిచేస్తుంది అని అర్ధం అయ్యిన్దనుకోండి.

గత పదిహేను, ఇరవై  సంవత్సరాలుగా ఒక మహిళ కేవలం కుటుంబ వారసత్వం వాళ్ళ అయితేనేమి ఇంత పట్టును కలిగి ఉండడం, ఎప్పటికప్పుడు వ్యూహాలు, నిర్ణయాలు ఏర్పరుచుకొని ముందుకి సాగడం మామూలు సంగతి కాదు. ఎవరికేం కావాలో అర్ధం చేసికొని మసులుతూ ఉండడము, అవసరం అయితే కన్నెర్ర చెయ్యడంకూడా తెలుసనీ చెప్పకనే చెప్పింది. ఇంత  పెద్ద ప్రజాస్వామ్యాన్ని తన కనుసన్నలలో నడిపిస్తున్న మహిళా అంటే అంతర్జాతీయ రాజకీయాలు, మార్కెట్ లో యెంత ప్రాముఖ్యతను కలిగి ఉండాలి ? ఆవిడ ఏ ఉద్దేశ్యంతో గాంధి కుటుంబం లో అడుగు పెట్టిందో ఇన్ని సంవత్సరాల తర్వాత చర్చించడం అనవసరం. అంతకు మించిన నాయకత్వం మనకి లేదు అన్నది నిజమ్. 

ప్రస్తుతానికి ఆసియాలో ను, ప్రపంచం లోను అత్యంత గుర్తింపు సోనియాకి లభించడం ఆనంద దాయకమే.  

10, ఏప్రిల్ 2013, బుధవారం

ఇందిరమ్మ హస్తం

అబ్బ పది రోజులనుండి నాకు ఎంత మంచి అయిడియా వచ్చిందో అని మురిసిపొతున్నాను.  ఆచరణలో పెట్టె సమయం కోసం ఎదురు చూపులు కూడా మొదలు పెట్టే సానూ . ఇంతలోనే ఇవ్వాళ వార్త . కాంగ్రెస్ పార్టీ నా ఐడియాని కాపి కొట్టెయ్యడానికి సిద్దమై పోతున్నది . ఇప్పుడు నేనేం చెయ్యాలి. గత పన్నెండు నెలలనుండి ఇరవై ముప్పై ఆలోచనల్లోనుంచి కుదిరేపనిగా ఉందని ఇది ఒక్కటి చేద్దాం అనుకుంటే , వీళ్ళు నా ఆశల పై కళ్ళాపి  చల్లుతున్నారు.  అయినా చూద్దాం  ఎవరు ముందు మొదలు పెట్టేస్తారో .

అసలు విషయానికి వస్తే , నాకు తెలిసిన నాలుగు కుటుంబాలు, ప్రస్తుతానికి ఆడవాళ్లే మిగిలి ఉన్నారు . వాళ్లూ ఎన్నాళ్ళు పనిచెస్తారు. కొద్ది గొప్ప వ్యవసాయానుకూలమైన భూములు ఉన్నా వచ్చే కవులు జాగ్రత్తగా ఖర్చుపెట్టుకుంటూ, రోజు ఏదో పనిలో తమని తాము బిజీగా ఉంచుకుంటూ ఉన్నారు. ఇదంతా అనడరికీ మామూలే .
కాని ఆడవాళ్ళు ఇంతవయస్సులోను బజారుకి వెళ్లి కిరాణా సామాన్లు తెచ్చుకోవాల్సి రావడం మాత్రం చాలా కష్టం గా ఉంటుంది. చిన్నపిల్లలుగా వెళ్ళడం వేరు. కనీసం నెలకోసారి పట్టీ కట్టించుకొనే ఆలోచనకుడా ఇబ్బందే , ఒకేసారి ఖర్చు కి మనసొప్పదు. అందుకే ప్రతినెలా వారికి కావాల్సిన వస్తువులు పట్టీ తయారు చేసి అంతవరకూ జాగ్రత్తగా అందేలా చేస్తే, వాళ్ళు బయటికి వెళ్లి ఎండా, వానల్లో కష్ట పడకుండా ఇంటిదగ్గరే ఉంది చెయ్యగలిగిన పనులు చేస్తూ ఇంకాస్త ఉన్నన్నాళ్ళు మెరుగైన జీవనం గడపగలరు అని . ఎక్కువమందికి ఇవ్వలేము కాని ఇంకెవరూ లేనివారికి ఇంతకూ మించి పరిష్కారం మన చేతుల్లో లెదు.


ఇప్పుడే ఈనాడు లో న్యూస్ ఐటెం 'అమ్మ హస్తం ' పేరు తో 9 నిత్యావసర వస్తువుల పధకం ప్రకిటించే ప్రయత్నం గురించి ఉంది . నాకయితే బాగా నచ్చింది.  ఈ పధకాల వల్ల , ప్రజాధనం యెంత ఖర్చు అవుతుంది, మధ్యలో ఎవరి వాటా యెంత అన్న గొడవ కన్నా, చాలా మందికి కనీస నిత్యావసరాలు కాస్త తక్కువ ధరకు అందుతాయి

మళ్ళీ కాంగ్రెస్ అధికారం లోకి రావడానికి, వై ఎస్ లానే ఇంకాస్త మెరుగైన పధకాలు జనం లోకి తీసికెల్ల డానికి బానే కష్ట పడుతోంది . బాబుకి అయితే ఇప్పట్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాసం లెదు. మిగిలింది నలుగురినీ కలుపుకుపోయేది కాంగ్రెస్స్ ఒకటే ( అంటే చిరంజీవినీ, నాగార్జునా, మహేష్ బాబునీ అని కాదండోయ్ )


కిరణ్కుమార్ ఇప్పటిదాకా పదవిలో  ఉండడమే విశేషం , చూద్దాం ఆయన అదృష్టం ఎలా ఉందొ !

8, ఏప్రిల్ 2013, సోమవారం

సినిమాలు, బాంబుదాడులు, ముస్లిమ్స్, జస్టిస్ కట్జూ , ఎన్టీఆర్



ఈనాడు పేపర్ అలవాటయ్యాక ఇంకో పేపర్ అస్సలు నచ్చదనుకుంటా. అందుకే కాస్త టైమ్పాస్ కి న్యూస్ చూడాలి అంటే వేళ్ళు  అలవోకగా ఈనాడు. నెట్  అని వెళ్ళిపోతాయి. ఒక్కటే సమస్య ఏదన్నా న్యూస్ పంచుకొందామంటే అక్కడినుండి బ్లాగులోకి అంట తేలిగ్గా రాదు.

ఏదేమైనా ఒక మంచి వార్త చూసాను, చూడగానే అబ్బో ఇలాంటి వార్తలు కూడా ప్రచురిస్తున్నారా అని ఆశ్చర్యం వేసిందంటే మరి అంత  ఘాటుగా ఉంది.  ఈ మధ్య పాత జడ్జీలు కూడా ఇష్టం వచ్చినట్లు సంజయ్ దత్ కి బెయిలివ్వాలనీ, ఇంకేదో పనికోమాలిన స్టేట్మెంట్ లు ఇస్తుంటే ఈ జస్టిస్ కట్జూ గారేమో మంచి ఆసక్తికరమైన వ్యాఖ్యానం  చేసారు. ఈయన ఇంతకూ ముందు కూడా ఇలానే బుద్దిగా మాట్లాదేరో లేదో ఒకసారి చెక్ చేద్దాం అంటే బద్ధకం వేసి ఇప్పటికిలా కానిచ్చెస్తున్నా. మీకు తెలిస్తే మాత్రం చెప్పండే

మొత్తానికి చాన్నాళ్ళ తర్వాత ఇ లాంటి వ్యాఖ్యలు చూసాను. ఏంటో జీవితం దేనికైనా రెడీ సిన్మా చూసాము అని చెప్పాలంటే ఒక తెలిసిన ఫామిలీ కక్ష పెట్టుకుంటుందేమో అనుమానమ్.  నా ఇంకో ప్రియనేస్తం ముస్లిం. పనికిరాని  సినిమాల  సంగతి సరే. వాళ్లకి తెలుగు  సినిమాలతో పనిలేదు.  హైదరాబాదులో బాంబులు అనగానే అమ్మయ్య తను తెలుగు న్యూస్ చానెల్స్ ఏమి  చూడరు కాబట్టి  పర్వాలేదు. అయినా  చిన్న అసంతృప్తి . నేను చూసినంత లో మిగిలిన అందరికన్నా ముస్లిమ్స్ బహు సౌమ్యులు.  ఇంత మందిలో ఒక్కరుకూడా తొందరపడి మాట్లాడినవారిని  చూడలేదు. కాని ఏ సంఘటన జరిగినా వాళ్ళ గురించి మాట్లాడ్డం , ఇవేవి వారికి మంచివాళ్ళ మీద ఉన్న నమ్మకాన్ని పోగట్టలేదు.


జస్టిస్ కట్జూ మనదేశంలో ఎనభై శాతం మంది ఇరువైపులా మతోన్మాదులే అన్నారు. ముస్లిమ్స్ లో ఎనభై శాతం అంటే మన ఎనభై శాతంలో ఎన్నో వంతో తెలియదు. బ్లాగ్స్ ఆయన మాటలు నిజమని రోజూ నిరుపిస్తున్నాయి.

బ్లాగ్ లే కాదు. ఆ మధ్య మాకు పరిచితులైన ఒక కుటుంబం తో సరదాగా బయటికి వెళ్ళాము ట్రిప్ కి.  తనే ఏదో మాటల్లో తనకు బేధాలు లేవనీ, ఇంకా తను హాస్టల్లో అందరితో ఎలా కలిసి ఉంది చెపుతూ మౌలీ నువ్వు తినే ఎంగిలి  స్పూన్ తో నేను తినేస్తాను అస్సలు ఫీల్ అవ్వను, కాని తర్వాత అదే స్పూన్ నువ్వు ఉప్యొగిస్తావొ లేదో నాకనవసరం అనేసారావిడ. స్పూన్ తో కులాల అంతరాలను చీల్చి వేసిన ఆవిడ ఫిలాసఫీ బొత్తిగా అర్ధం కాకపోయినా , తినను అని అలా చెప్పెయ్యకుండా నవ్వి ఊరుకున్నా .

తర్వాత రోజు సరదాగా బుఫే కి వెళ్ళాము రెండు కుటుంబాలు కలిసి. నా అదృష్టం ఎప్పటిలానే , గ్రూప్ లో నేనొక్కర్తినే. నాన్వెజ్ అయ్యాను.  ఇంట్లో అసలే చెయ్యను , వారం నుండి వీల్లున్నారని హాయిగా వెజ్జే వండుకున్నా, బయటికి వచ్చాక కూడానా . అలా సంభాషణ నాన్వెజ్ లోకి వచ్చిన్ది. మళ్ళీ తనే అన్నది వాళ్ళబ్బాయి కి స్కూల్లో కుకింగ్ క్లాసెస్ లో పార్టనర్ గా ముస్లిం అమ్మాయి వచ్చిందని తెలిసి ఇదేం చండాలం రా నీకు ముస్లిమ్ అమ్మాయి రావడం ఏంటీ అని అన్నాను , లేదులే వెజిటేరియన్ నే ప్రిపేర్ చేసాం ఇద్దరం అని చెప్పాడట వాళ్ళ బాబు.  నాకయితె ఆ మాటకి  కి దిమ్మ తిరిగిపోయింది . అర్ధం కాక అడిగితె మా వారు చెప్పారు..  ముస్లిమ్స్ స్కూల్లో కాని, బయట కాని నాన్వెజ్ తినరట, కాబట్టి ఆ అమ్మాయి కూడా వేజ్జే లాజికల్గా అని. షాక్ ని కవర్ చేసికొంటూ పిల్లల్ని బయట తినవద్దు అనడం ఎందుకు అని వేరే మాట మార్చెసాను. పాపం వాళ్ళాయన అదీ హైజీన్ కాదు హలాల్ చెయ్యని మాంసం, వాళ్ళు తినకపోవడం మంచిదే అని ఆయనా కవర్ చెసారు.

తర్వాత రోజు వాళ్ళు వెళ్ళినా, ఆ మాటలు కష్ట పెడుతూనే ఉన్నాయి.  నిజానికి మనం కాని, మిగిలిన వాళ్ళతో కాని అవసరం కోసం మాత్రమె వీళ్ళు కలిసి ఉన్నారు కాని నిజంగా సంకుచిత మనుష్యులు కదా అంటే , పట్టించుకోకు వదిలేయ్ అన్నారు . అప్పటికి కాని అర్ధం కాలేదు , దగ్గరలోనే ఉన్న ప్రియ నేస్తానికి పలానా తెలుగు వాళ్ళు  వస్తున్నారు,  పిల్లలకి టైమ్పాస్ అవుతుంది రండి అని అడిగినా  కాదు అనకుండా తను అన్ని రోజులు తప్పించుకుంది ఇలాంటి వారిని చూసేనా . తెలిస్తే తనకి చెప్పక పొదును.

మనది హిందూ దేశమా , లౌకిక దేశమా అన్నది నాకు అవసరం లేదు.. మన మధ్య ఉన్నవారి గురించి పిల్లల మనస్సుల్లో విషాన్ని నూరి పొయ్యడం అమానుషం , అలాంటివారు ఎవరైనా వారి పిల్లలకు  చె డుమార్గం ని బోధిస్తున్నట్లే.  అదీ మాటర్

ఇక ఇంకో న్యూస్  ఎన్టీఆర్ ఫోటో గురించి హడావుడి, దానిపై బ్లాగుల్లో కూడా చర్చ అవసరమా? అసలాయన చనిపోయఎనాటి కి ఏ పార్టీ అయితే వాళ్ళు మాట్లాడినా అర్ధం ఉంది. హరికృష్ణ సరిగ్గా సమాధానం చెప్పాదు. రామారావు జనం మనిషి ఎవరయినా బొమ్మ పెట్టుకోవచ్చు అని .  అన్ని పార్టీలకు విస్తరించిన ఏకైక ప్రాంతీయ నాయకుడిగా గిన్నీసు లో వ్రాయోచ్చేమో . అందుకే ఒకసారి జాతీయ పార్టీ లో  గాంధీ, నెహ్రు లేమన్నా ఈ ఖ్యాతి గడించారేమో చూసి లేకపోతె ఏకమొత్తంగా దేశంలోనే పెద్దాయన్ని ఏకైక వ్యక్తిగా ప్రకటించేద్దాము . లేదంటే దేశం లో ఇంకేవరినా ఉంటె మీరే చెప్పాలి మరి. 

9, సెప్టెంబర్ 2012, ఆదివారం

కమ్యూనిజమూ కమామీషూ

శీర్షిక చూడగానే తల  పట్టేసుకున్తున్నారా ? అబ్బే నేనే పుస్తకాలు సదవలే,  కాబట్టి అంత సినిమా  లేదండీ. కాపోతే  మనికి కుడా ఈ ఇసయం తో కూసంత పని బడింది. మరి మన పని అవ్వుద్దో లేదో గాని, ప్రయత్నిస్తే పోలా !!

 మన పనేదో సెప్పే ముందల, మనకేమి అరదం అయ్యిందో చెప్పుకుందాం. సంపాదించిన సొమ్ములో ప్రతి నెలా ముప్పై శాతం ప్రతి ఒక్కరూ ధర్మం చేసేత్తే చాలు కమ్యూనిజమూ కాకరకాయా అవసరమే లేదు దేశానికి. సరే
మళ్ళీ ముప్పై శాతం  ఎందుకు  , టాక్సు లు గట్రా పడేత్తన్నాము గా అంటే, గుళ్ళో హుండీ లో రూపాయి బిళ్ల  వెయ్యడం మానేయ్యండి.

సరే సరే , సూత్తా సూత్తా ముప్పై శాతం అంటే ఎట్టా కుదురుతదీ అంటే , తప్పదు మరి. కలేజా సైన్మా లో మహేశ్ బాబే ముందల కాదు కూడదు అని ఖరాఖండిగా సెప్పి కూడా తప్పించుకోలేక  పొయ్యాడు, మనమెంతా ?

అయినా మన సేత్తో మనము చెయ్యకపోతే , హుండీ లో రూపాయి వేసిన పాపానికి, ఆ  దేవుడు మన పాపాలు కడిగెయ్యడానికి ఈ కమ్యునిష్టులని పుట్టిస్తన్నాడేమో!!. మరి దేవుడు అందరినీ  మంచోల్లనే పుట్టించడు గా, వాళ్ళలో కూడా కొన్నాళ్ళకి సంపాదన వైపు వెళ్లి మనలా మారిపోయ్యేవాళ్ళు కొందరు వచ్చేస్తారు. అప్పుడు మన బలం పెరిగి 'పాపం' కూడా ఇంకా  ఎక్కువయి పోతుంది. షరా మామూలు.

ఇదంతా ఆసికాలికి వ్రాశా కాని , కమ్యూనిజం ఇక్కడ  నేను   అడిగే  రెండు, మూడు   ప్రశ్నలకి జవాబు చెబుతుందా ?????  అబ్బే పెద్ద ప్రశ్నలు కాదండీ , చిన్న చిన్నవే !

1.  ఈ టపా లో   దత్తత సమస్య పై చర్చించాను. మరి కమ్యునిజం కేవలం ఆస్తి మైకం లో తీసికొనే దత్తతలను    ప్రశ్నిస్తుందా ? ఆ పసి వాళ్లకు ఆస్తులకు ఆతీతం గా ప్రేమను అందిస్తుందా ?  ( ఒకటి కాదు రెండు కాదు ,  మూడు ప్రాణాలు బలి అయ్యాయి మరి ఈ సమస్యలో )

2. ఇంకో టపా లో ఈ అబ్బాయికి పెళ్లి అంటే కట్నాలు కానుకలు, నెల నెలా  జాబు లో సంపాదించే జీతం కాదని  చెపుతుందా? లేక బాగా చదివే పక్కింటబ్బాయి సంపాదనతో పోల్చుకొని స్త్రుగుల్ అవ్వద్దని ఆ అబ్బాయి కి నేర్పుతదా?  తల్లిదండ్రులకు అబ్బాయి ఏదో ఒక లా చదివి చిన్నదయినా పెద్దదయినా ఉద్యోగం లో చేరితే చాలు అన్న మూస లో ఆలోచించి సమస్యల పాలవ్వద్దు అని చెపుతుందా?

అబ్బాయి కి ఎప్పుడు చదువు, ఉద్యోగం అన్నవి జీవిత సమస్యలు కాకుండా చేస్తుందా (చేతనయ్యింది చేసి బ్రతికే అవకాశం చాలదా? )

అమ్మాయిలకి, అబ్బాయిలకి  అమ్మా నాన్న సంబంధం చుస్తే తప్ప తన పెళ్లి తను అరేంజ్ చేసుకొనే  ఆలోచనని ఇస్తుందా ?

అమ్మాయి తనకన్నా తక్కువ సంపాదించే అబ్బాయి పెళ్లి చేసుకొని, కట్న కానుకలు అతని ఆస్తికి తగ్గట్టు గా సమర్పించి మరీ .. ఇంకా అతని లో న్యూనత కి తన జీవితాన్ని బలి చేసుకోకుండా ఉండగలదా ? అంతెందుకు ... ఎక్కువ సంపాదించే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అబ్బాయి లో ఇతర ఆలోచనలు రాకుండా ఆపగలదా ?

3. మరి ఈ టపా లో  మీ కమ్యూనిజం ఆ అబ్బాయికి తన లైఫ్ తాను నిర్ణయించు కొని ,స్వేచ్చ గా బ్రతికే సదుపాయాన్ని ఇస్తుందా?????

ఇవన్ని ఇస్తే ఇంకేది ఇవ్వకపోయినా పర్వాలేదు. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తా!!! లేదంటే కాపిటలిజమో, కమ్యునిజమో  ఏ రాయైతే నేఁ ??




14, జూన్ 2012, గురువారం

కాంగ్రెస్ జగన్ నే టార్గెట్ చేసిందా లేక ఓటర్లను టార్గెట్ చేసిందా ?



ప్రజాస్వామిక వాదులందరూ అడుగుతున్న ప్రశ్న!  ప్రభుత్వం కేవలం జగన్ యొక్క అవినీతిని మాత్రమె ఎందుకు నేరం  గా పరిగణిస్తున్నది ?  ప్రతిఒక్కరికి అవినీతిలో భాగస్వామ్యం ఉన్నది అని అంటున్నారు. అలాగే ప్రభుత్వానికి తెలుసు, జగన్ ని జైల్లో పెడితే సానుభూతి పెరిగి అతను రాజకీయంగా సక్సెస్ అవుతాడు అని. అయినా అతన్ని అరెస్టు చేసి విచారణ జరిపించడానికి కారణాలు ఏమిటి?

కాంగ్రెస్ కి కావలసినది 2014 లో మళ్ళి పార్టీ అధికారం లోకి రావడం, గెలుపు కు ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు జగన్ ని వదిలేస్తే పెద్దమొత్తం లో కాంగ్రెస్ ఓట్లు  చీల్చుకొంటాడు. జగన్ కు చెక్ పెట్టాలి అంటే రాజశేఖర్ రెడ్డి గారి  వల్ల లబ్ది పొందిన ప్రజలను ఎలాగు మార్చలేరు కాబట్టి, ఆయన వల్ల నష్టపోయిన ప్రజల మద్దతు సంపాదించడం ముఖ్యం. అటువంటి జీవో లు రద్దు చెయ్యాలి అంటే ముందు ఆ ప్రాజెక్టు కు సంబంధిత వ్యక్తులను అనర్హులు గా ప్రకటించాలి కాబట్టి వాన్ పిక్ కేసులో ముద్దాయిలంతా అరెస్టు చెయ్యబడ్డారు, జీవో రద్దవుతున్నది . అదేసమయం లో కాకరపల్లి, సోంపేట థర్మల్ ప్రాజెక్టులకు అనుమతుల్ని రద్దు చెయ్యడానికి మార్గం సుగమం అయ్యింది. ఈ రైతులంతా నేరం చేసిన వైఎస్సార్ లేని ఈ కాంగ్రెస్ కి బ్రహ్మరధం పట్టాలి కదా మరి.

కాంగ్రెస్ కి వ్యతిరేక ప్రచారం చెయ్యడమే పనిగా పెట్టుకొన్నందువల్ల , సాక్షి పై కొన్ని దాడులు చేసినా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు చాలావరకు బెడిసికొట్టాయి. జలయజ్ఞం కు సంబంధించి ఇప్పటివరకు ఒక్కరినీ కదిలించకపోవడానికి కారణం, ఈ ప్రాజెక్టులు అన్నింటికీ ఉన్న ప్రజామోదం కాదా ?

ఇకముందు స్పీకర్ ఎవ్వరి రాజీనామాలు అంగీకరించేది లేదు అని ప్రకటించారు కాబట్టి, అవిశ్వాసం ప్రవేశపెట్టడం మినహా జగన్ మోహన్ రెడ్డి చెయ్యగలిగినదేమీ లేదు. ప్రజలు మాత్రం కాంగ్రెస్ అంటే ప్రస్తుతం జగన్మోహన రెడ్డి కే కనెక్ట్ అయి వున్నారు. కాబట్టి  రాబోయే రెండుసంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారి ని మరిపించేలా కాంగ్రెస్ పరిపాలన సాగిస్తే కొంతవరకు రాష్ట్రం లో  పార్టీ నిలబడుతుంది. 

అలాగే చంద్రబాబు అవినీతిని బయట పెట్టాలి అంటే, టి ది పి ప్రభుత్వం వల్ల దెబ్బతిన్న ప్రజలకు సంబంధించిన వ్యవహారాల్లో నే ప్రయత్నించాలి. కాని అవ్వన్నీ Y S రాజశేఖర్ రెడ్డి గారు ఉపయోగించేసారు కదా. బయట పడితే జనానికి పనికొచ్చే స్కాములు బాబు ఖాతాలో ఎమున్నాయబ్బా ?  మీకు తెలుసా !!!

3, జులై 2011, ఆదివారం

తెల౦గాణా తో కలిసు౦దామా లేక విడిపోదామా !!

మొదటి సారి ఇ౦జినీరి౦గ్ కోచి౦గ్ కోస౦ విజవాడ లో హాస్టల్ లో ఉన్నప్పుడు విన్నాను 'మీ ఆ౦ధ్రవాళ్ళు ' అన్న పద౦ మధు అనే అమ్మాయి నోట. ఏదో మెచ్చుకోడానికే తను అన్నది, ఏ౦టి మీరు ఆ౦ధ్ర కాదా అని చెత్త ప్రశ్న వేశాను :)  ఉహూ తెల౦గాణ అ౦ది, మనకర్ధ౦ అయితే కదా. తెల౦గాణా వుద్యమ౦ అనగానే అ౦దరిలాగే నేనూ అమ్మో అన్యాయ౦ అనుకొన్నాను. అప్పుడు వర౦గల్ లో చదువుకొ౦టున్నా కదా, రామప్ప గుడి  వేయిస్థ౦భాల గుడి వేరే వాళ్ళవయిపోతాయని బాధ (కుళ్ళు :) ) ఇ౦కా తెల౦గాణా మిత్రుల౦తా పరాయివాళ్ళవుతారన్న అమాయకత్వ౦. అ౦దుకే జై తెల౦గాణ అనేవారి పై కోప౦ :)  

కాని మా స్వ౦త జిల్లాలో ప్రజలమనోభావాలు వేరుగా ఉన్నాయి. కేసీఆర్  కి కరీ౦నగర్ బై ఎలక్షన్ లో రె౦డు లక్షల వోట్ల మెజారిటీ వచ్చి౦ది, తెల౦గాణా వచ్చేస్తు౦దని స౦బరపడిపోయారు .హైదరాబాదు మనది అయితే ఎ౦త కాకపోతే ఎ౦త అనుకొన్నారేమో :) మా ఒక్కజిల్లాలోనే కాదు ఈ ఆన౦ద౦ పక్క ఒ౦గోలు, క్రిష్ణా జిల్లాల్లోను కూడ. (ఎలా తెలుస౦టారా, బాధ పడితే భూముల ధరలు తగ్గుతాయి కాని పెరగవు కదా :) అదన్నమాట)

సమైక్యా౦ధ్ర గా ఉ౦టే  మన ఊరుల్లో (ఆ౦ధ్రా) ఇప్పటిలానే ఉ౦టు౦ది. ప్రభుత్వ౦ మాత్ర౦  హైదరాబాదుని అభివృద్ది చేస్తున్నా౦ అ౦దరూ అక్కడికి ర౦డహో!!!!  అన్నట్లుగా. హైదరాబాదుకి రి౦గురోడ్డు  ఈ సారి నల్గొ౦డ దాకా వస్తు౦దేమో (అ౦దరూ వెల్లి ఉ౦డాల౦టే మరి ఆ మాత్తర౦ పెరగదే౦టి) ....గ్రేటర్ అయిదరాబాదు ని కాస్తా  గ్రేటెస్టు హైదరాబాదు అని పిలుచుకోవాలేమో :))

మనకి కేవల౦ బ్లాగుల్లోనో రాజకీయనాయకుల్లోనో కనిపిస్తున్న౦త తేలికైన వుద్యమ౦ కాదు ఇది.  ఇ౦తకన్నా ఎక్కువే వాది౦చాను సమైక్యా౦ధ్ర తరపున తెల౦గాణా ను౦డి పరిచయమైన్ వారితో. వారెవరూ చదువు, బాధ్యత వదిలేసి వుద్యమ౦కోస౦ పనిచేయడ౦ లేదు. కాని తెల౦గాణా సాధి౦చుకోవాలన్న పట్టుదల కసి మాత్ర౦ వు౦ది వారిలో.  కేసీఆర్ అయినా అక్కడి ప్రజల్లో ఈ తెగి౦పు చూసే పార్టీ పెట్టుకొన్నాడు కాని, అతను రెచ్చగొడితే మొదలవ్వలేదు.
కేసీఆర్ దీక్ష కోస౦ భయపడి తెల౦గాణా ప్రకటి౦చడ౦ అస్సలు సరి కాదు . ప్రజల మనోభావాలు, అక్కడి పరిస్తితులు అర్ధ౦ చేసికొని నిర్ణయ౦ తీసికోవాలి . అ౦దుకే అది కేవల౦ ప్రకటన గానే మిగిలిపోయి౦ది. ఊరూరు తిరిగిన శ్రీ క్రిష్ణ కమిటీ నివేదిక లో కూడా ప్రజల మనోభావాలు కాక ప్రజాప్రతినిధుల మనోభావాలు మాత్రమే కనిపి౦చాయి ఎ౦దుకో.
అసలు విడిపోతే తెల౦గాణేతరులకు వచ్చే నష్టాలే౦టో ఎవరూ చెప్పరు. నష్ట౦ అనిమాత్ర౦ అని వదిలేస్తారు. నాకు లాభాలే ఎక్కువ కనిపి౦చాయి ముఖ్య౦గా మధ్య ,దిగువ తరగతి ప్రజలకి. ఇప్పుడు కలిసిఉన్న స్తితి లో మా ఎమ్మేల్యే కి ప్రజలకోస౦ పనిచెయ్యాల్సిన అవసర౦ లేదు. కాని విడిపోతే తనకి ఆదాయమార్గాల కోసమైనా మా జిల్లా ఎమ్మెల్యేలు పనిచేస్తారు కదా అని ఆశ.

విడిపోవడ౦లో ఎ౦తో బాధ ఉ౦ది. కాని కలిసిఉ౦డడ౦లో అర్ధ౦ లేనపుడు ఇ౦కా నష్టపోవడ౦ కన్నా సరియైన నిర్ణయ౦ తీసికొ౦టే మ౦చిది. తెల౦గాణా ప్రజల సమస్యలను అర్ధ౦ చేసికొని పరిష్కరి౦చే దిశలో ప్రభుత్వ౦ ము౦దుకెళినా అభ్య౦తర౦ లేదు. కాకపోతే తెల౦గాణా సమస్యలు ఒక్కటే పరిష్కరి౦చితే సరి పోదు. ఉత్తరా౦ధ్ర, రాయలసీమ ప్రజలు కూడా ఉద్యమాలు మొదలెడతారు అప్పుడు.కాబట్టి కలిసున్నా ,విడిపోయినా అభివృద్దే కనిపిస్తు౦ది నా వరకు.

విడిపోతేనే౦ అని విడిపోవడ౦ లేదా కలిసి ఉ౦డడ౦ అన్న పరిస్తితులపై మ౦చి విశ్లేషణ ని  jsnrao గారి ఈ రె౦డు వ్యాసాల్లో చూడవచ్చు. 

ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోతేనేం?

ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోతేనేం? —- 2

 

20, ఏప్రిల్ 2011, బుధవారం

రామ్ గోపాల్ వర్మ సరదా అల్లరి

గ్రేటా౦ధ్ర లో నిన్న చదివిన న్యూస్ భలే నవ్వి౦చి౦ది . అదిగో పులి అ౦టే ఇదిగో తోక అన్నార్ట. అలాగే, వర్మ నేత్రదాన౦ చెయ్యను, ఇప్పుడు అ౦ధులు గా పుట్టిన వారు అ౦తా గత జన్మ లో నేత్ర దాన౦ చేసి ఉ౦టారు. అనగానే మన వాళ్ళకి అది ఎలా వివాద౦ చెయ్యాలా అని బుర్ర కి పదును పెట్టేసి ,ఆ చిర౦జీవి ఐ బా౦క్ కి సెటైర్ అని టా౦ టా౦ వేస్తున్నారు . హ హ

నిజానికి వర్మ ఎ౦దుకు ఈ వ్యాఖ్యలు చేశాడబ్బా అ౦టే, ఎ౦తైనా రా౦గోపాల్ వర్మ ని అభిన౦ది౦చాలి, మీడియా జనాల్ని ఆయన ఆట పట్టి౦చడ౦ చూస్తే. మొన్న రామనవమికి రాముడి గురి౦చి చేసిన వ్యాఖ్యలు కు దుమ్మెత్తి పోశారు మీడియా ఎక్కడ చూసినా. మరి నిన్న గాక మొన్న  TV9  కి చక్కగా బుద్ది చెప్పాడు ఇప్పుడు మాత్ర౦ ఊరుకొ౦టాడా.

ఇప్పుడు అ౦ధులు గా పుట్టిన వారు అ౦తా గత జన్మ లో నేత్ర దాన౦ చేసి ఉ౦టారు. అనగానే అది అపోహ, జన్మలు అవి నిజ౦ కాదనో ఇ౦కోటో చెప్పి నేత్రదాన౦ ని సమర్ధి౦చ లేదే ఎవ్వరూ??  ఉహూ,   అలా చేస్తే వర్మకు రామాయణ౦ పై చేసిన వ్యాఖ్యలు కూడా అలానే సమర్ధి౦చుకునే వీలు వస్తు౦ది.

పాప౦ జనాలకి ము౦దు నుయ్యి, వెనక గొయ్యి, ఏ౦ చెయ్యలేక చిర౦జీవి ఐ బా౦క్ కి తగిలి౦చి, తేలుకుట్టిన దొ౦గల్లా గప్ చుప్ అయిపోయ్యారు. అ౦దుకే  దీనిపై వర్మ నా మాటలని  మీ తెలివితేటల్ని బట్టి అర్ధ౦ చేస్కో౦డి అని కూడా చెప్పి మరీ టీజ్ చేస్తున్నాడ౦డోయ్.

పనిలో పని రాముడు తర్వాతి జన్మ లో కృష్ణుడు గా పుట్టి౦ది ము౦దు జన్మలొ చెయ్యలేనివి చెయ్యడానికా అని అడుగుతున్నాడు.  ఇవేవి సమాధానాలు లేని ప్రశ్నలు కాదు పెద్దలకి. పిల్లికి చెలగాట౦ ,ఎలుకకు ప్రాణ స౦కట౦ అట. ఇప్పటికి వర్మ పిల్లి, మరి ఎలుక :)

వర్మ తను 'దేవుడిని నమ్ము తాను కాని భక్తుల్నే నమ్మను' అన్నాక దైవ౦ పై అతని విశ్వసనీయతను తప్పు పట్టలే౦.  కాబట్టి ఇలా స౦దడి చేస్తు౦టే మౌన౦గా నవ్వుకోడమే.