26, ఆగస్టు 2013, సోమవారం

ఆంధ్రా లో సమైక్య హింస నుండి కాపాడే దేవుడా కే సి ఆర్ ?



న్యూస్ పేపర్స్ సమైక్య ఉదయం తీవ్రత గురించి అంతా ఇంతా కాదని చెప్తోంటే ఏమిటో అనుకొన్నాం గాని , ఒక్కో కధ వింటుంటే నవ్వు వస్తుంది. వీళ్ళకి ఆవేశం వచ్చి బందులు చేస్తుంటే సామాన్యజనం పట్టించుకోవట్లేదని ఉద్యమకారులు తీవ్రంగా పగ బట్టేసారు.  ముందు ఊర్లకి బస్సులు ఆపేశారు. కచ్చితంగా తెలిసి చస్తుంది ఇక అనుకొన్నారు కాని, బస్సులు వచ్చినా రాకపోయినా సగమందికి పెద్ద లెక్క కాదు, ఇక షాపులు మూయించి పడేసారు . నెలకొకసారి కొనుక్కునే జీవులు కాదుగా కాస్త చిరాకు పడ్డారు కాని, అదేన్నాల్లు లే, గవర్మెంట్ ఉద్యోగం కాదుగా కిరాణా కొట్టు . ఏదో బస్సుల్లేవు కాబట్టి పక్కోరికేల్లి కొనుక్కోలేరులే అని నాలుగు రోజులు కొట్టు కట్టేసి కావాల్సిన నాలుగు రకాలు వండుకొని సుష్టుగా తిని రెస్టు తీసుకొన్న దుకాణు దారులు మళ్ళీ విధుల్లోకి అదేనండీ వ్యాపారం లోకి వచ్చేసారు. ఇక ఆటోల వాళ్ళపై పది ఎడుస్తున్నారట బాగు పడి పోతున్నారని , వాళ్ళకీ ఉపాయం తట్టింది రోజుకో కూడలి దగ్గర ఒక్కో గ్రూప్ బంద్  పాటిస్తారు, మిగిలినవాళ్ళు బంద్  పండగ పుణ్యమా అని నాలుగు రాళ్ళు వెనకేసుకునే హడావుడి మామూలే .

రోగాలకి ట్రీట్మెంట్ తీసుకొనే వాళ్లకి ఆటోల ఖర్చులు అదనం కాక, అసలు గమ్యం చేరుతారో లేదో తెలియదు . ఇంకొందరికేమో  బీరువా నిండా చీరలున్నా పాడు బందు షాపింగ్ కి కూడా వెళ్ళలేకపోతున్నాం అని దిగులు జ్వరం పట్టికుంది కాని ప్రచారంలో ఉన్నట్లోల్ అయ్యో అయిదరబాదు  పోతుందే అన్న బెంగ మాత్రం లేదంటే నమ్మండి .

ఇది చాలదన్నట్లు కాస్త పెళ్ళిళ్ళు ఫంక్షన్ల సీజనాయే . అక్కడా ఖాళీ కుర్చీలు వెక్కిరిస్తున్నాయట . అంటే

ఇదికాక సచ్చినోళ్ళు ఇంకో రెండ్రోజుల్లో కరెంట్, నీళ్ళు కూడా ఆపెస్తారంటా అని ఫోన్ లో చెప్తుంటే పకాల్న నవ్వొచ్చింది. పాపం ఈ గొడవేమో గాని జనాలు టీవీలకు అతుక్కు పోయారు. మా పిన్ని చెప్తున్నారు, వాడు  డి ల్లీ పొయ్యాడు ఏం చేత్తాడో అని అంటుంటే, వాడా వాడెవడూ అంటే కే సీ ఆర్ అట . మరి ఈ కరెంటూ, నీళ్ళ కష్టాలు తీర్చడానికి ఆంధ్రలో మనిషే లేనట్టు పాపం సగటు సీమాంధ్ర కేసీఆర్ వైపు ఆశగా చూస్తోంది . వార్నీ వీడింత పాపులర్ అయ్యాడా ఆంధ్రలో అని ముక్కున వేలేసికోవాలి.

ఏదేమైనా అన్ని పార్టీల ఆశలూ ఆంధ్ర పైనే ఉండడం ఇప్పుడు ఆంధ్రులకి శాపం అయ్యింది . ఎక్కడ పక్కోడి  మాటలు నమ్మేస్తారో అని పతోక్కడూ ఉద్యమం మొదలెట్టాడు . ఇప్పుడు దీక్ష చేస్తే వచ్చే మైలేజీ  ఎలక్షన్లో పదికోట్లు పంచినా రాదనీ అర్ధమై పోయింది . అందుకే నాలుగు రోజు కడుపు మాడ్చుకొని ఉద్యమ నేత అయిపోవాలని తపన పడుతున్నారు .

ఇంత  చేస్తున్నా ఆంధ్రులకి ముందుకొచ్చి ఇదేంటి అని అడగాలని తోచదో ఏంటో . కరెంటూ నీళ్ళూ రాకుండా చెయ్యడమేంటి వీళ్ళ తిక్క తగలెయ్య, రాష్ట్రం గబ్బు పట్టి పోతది . 

18, ఆగస్టు 2013, ఆదివారం

ఫెమినిజం లో అమ్మా , అత్తగార్లు -2

ఫెమినిజం లో అమ్మా , అత్తగార్లు మొదటి భాగం ఇక్కడ :


ప్రవీణ చెప్తూ ఉంటె చాలా కోపం వచ్చింది అప్పట్లో . అంకుల్ సరే అంటీ కూడా ఇలా చేయవచ్చునా  . నాకెంత అభిమానమో ఆమె అంటే , ఒక్కసారిగా ఇలా మారిపోయారా అని చాలా కష్టం అనిపించిన్ది.

సరే  ప్రవీణ తమ్ముల్లలో ఇద్దరు నాకు బాగా క్లోజ్. వాళ్ళలో రమేష్ కి అయితే  ప్రవీణ  భర్త ట్రైనింగ్ ఇప్పించి, తానె పూర్తిగా సహకరించి ఒక మల్టినేషనల్ కంపెనీ లో ప్రోగ్రామర్ గా జాబ్ తెప్పించారు . చిన్న తమ్ముడు అయితే సెలవుల్లో తప్పక ఒక వారం వచ్చి వెళుతున్నాడు . కాని అమ్మ మాత్రం మొదటి సారి ప్రెగ్నెంట్ గా ఉన్నపుడు ఒక నాలుగు రోజులు అదీ కూతురు బ్రతిమిలాడితే వచ్చి వెళ్ళారు. తనే డెలివరీకి , పండుగలకి అని పుట్టింటికి వెళ్లి వస్తు ఉంది .


 మరి తమ్ముళ్ళు ఏమంటున్నారు అంటే, వాళ్ళు అమ్మకే సపోర్ట్ ...తన బాధ తనది అని అంటున్నారన్నది . ఇది ఇంకో షాక్ .

 మీ అమ్మకి  చక్కగా డబ్బులు అవీ ఇస్తూ కాస్త మంచి చేసికోవచ్చు కదా కాస్త మారతారేమో అని అడిగి చూసాను . నవ్వ్వేసింది , అలాంటివి చేస్తే మా అమ్మ ఇంకోసారి నా ముఖం కూడా చూడదు. ఛీ కొడుతుంది ఇంకేం లేదు అన్న తర్వాత ...ఇదెక్కడి  సమస్య అనిపించింది .


 ఆంటీ  నాకు ప్రశ్నగానే మారిపోయారు . తర్వాత ఒకసారి మా ఇంటికి నన్ను చూడ్డానికి వచ్చారు , ఇంకోసారి గుడిలో కనిపించారు. అదే ప్రేమ ..వాల్లమ్మాయి  గురించి కూడా సంతోషం గానే మాట్లాడారు . ఆమెని నేనెక్కడో అర్ధం చేసికోలేదనిపించింది .


చాలా రోజులు పట్టింది ఆమె అంతరంగం అర్ధం కావడానికి. ఒక ఆడపిల్లకి తల్లిగా మన సంస్కృతి ఇన్నాళ్ళు పెళ్లి చేసి అత్తారింటికి పంపెవరకే మన అమ్మాయి అని నూరి పోసింది . బహుసా అదే గుడ్డి నమ్మానేమో , ఆమెని అర్ధం చేసుకోవడం లో పొరపాటు జరిగింది .

ఆవిడకి నలుగురు పిల్లలు , నలుగురూ ఆడపిల్లలో మగపిల్లలో అయితే ఏ గొడవాలేదు కాని ముందు అమ్మాయి తర్వాత ముగ్గురు అబ్బాయిలు. కాని మగపిల్లలతో సమానంగా, ఇంకా కాస్త ఎక్కువ ప్రేమ అభిమానాలు కలిపి తనని పెంచారు . మగపిల్లలకి ఆడపిల్లగా, అక్కయ్యగా తనకెంత విలువ ఇవ్వాలో కూడా చక్కగా నేర్పించారు . అప్పటి అందరు ఆడవాళ్ళ లా భర్త సంపాదిస్తుంటే  కేవలం పిల్లల్ని బాధ్యతగా పెంచడమే కాకుండా, గేదెల్ని పెట్టుకుని , ఇంకా అంకుల్ కి వ్యవసాయం లో కూడా సాయం చేస్తూ తన సంతోషం అంటా పిల్లల్లోనే చోసుకొన్నారు. నలుగురిని పెంచాలి కాబట్టి సంవత్సరానికి   రెండు చీరల్ని మించి  ఎప్పుడు కొనుక్కోలేదు.


 తను  ఉద్యోగం మారి గుంటూరు కి వస్తే ఫామిలీ షిఫ్ట్ చేసి మరీ తనతో ఉన్నారు. అంకుల్ రోజు వెళ్లి వచ్చేవారు. కూతురు పెళ్లి విషయం లో యెంత ఆలోచన చేసారో నాకే తెలుసు . కట్నం విషయానికి వస్తే ఆయన మాటలు నవ్వు తెప్పించేవి . కట్నం ఇవ్వనన్నారు సరే, వచ్చి వెళ్ళే మారేజ్ బ్రోకర్స్ కి కూడా పైసా ఇవ్వనన్నారు ముందే . ఆయన పెంపకం పై ఉన్న నమ్మకం అదీ .

 పెళ్లి  తర్వాత కూడా అత్తా మామలేమి తన బాధ్యతా తీసికోలేదు , వీళ్ళే ఉన్నారు తనకి  భర్త ఉండే చోటుకి బదిలీ అవడానికి ముందువరకూ . కాని ఒకరోజు అలా వదిలేసి వెళ్ళిపోయారు . ఎందుకంటె!!!!


మన సంస్కృతిలో కూతురికి , కొడుకు కి చాలా తేడా ఉంది . కొడుకు కి తల్లిదండ్రులంటే బాధ్యత, జవాబుదారీ ఉండాలి . వారికి  సంపాదన పై హక్కు, కొండకచో అజమాయిషీ కూడా ఉండి  తీరాలి. కాని  అంతే కష్టపడి చదివించి, మంచి ఉద్యోగంలో చేరాక పెళ్లి చేసి అల్లుడి కాళ్ళు కడిగి నెత్తిన నీళ్ళు చల్లుకోవాలి . అమ్మాయి భర్త అడగ్గానే తన మరిది వీసా ప్రాసెస్ కోసం   అకవుంట్ ఖాళీ చేసి ఇచ్చెయ్యాలి . అక్కడే ఉన్న అమ్మా నాన్నకి చెప్పనవసరం లేదు , ఎందుకంటే ఇప్పుడు తన కుటుంబం వేరు . కాని తన కుటుంబం అనుకునే ఆ అత్తా మామలు కాని , భర్త కాని వచ్చి తన బాధ్యత  తీసికోరు .

బహుసా అందుకేనేమో ప్రవీణ వాళ్ళ అమ్మ ఇప్పుడు మవునం గా వదిలి వెళ్ళడం లో  నాకు  ఒకే అర్ధం కనిపించింది . హక్కులు అత్తా , మామ కుటుంబం మరియు భర్తవి అయితే, బాధ్యతలు కూడా పూర్తిగా వారివే. ఇప్పటి వరకు కష్టపడింది చాలు . మిగిలిన పిల్లల సమస్యలు చూసుకోవాలి కాబట్టి కూతురు విషయంలో తన ప్రమేయం ఇంచుక కూడా అక్కర్లేదు అని తప్పుకొన్నారు.  ఈ నిర్ణయానికి రావాలంటే ఒక స్త్రీకి యెంత ఆత్మాభిమానం కావాలి !!! అంతకుమించిన జీవితానుభవం, ఆలోచనా పరిణితి ముఖ్యమ్.

అమ్మాయి అంటే గారాబం గా పెంచి ఇంకో ఇంటికి దానం చేసే ఆస్తి కాదు. తనకూ వ్యక్తిత్వం వుందని అవతలి వాళ్ళు తెలుసుకోనంత కాలం ప్రవీణ కూడా తనకి అందరి అమ్మాయిలకు ఉన్న లాంటి కన్న తల్లి ప్రేమ దొరకట్లేదు ఎందుకు అని అత్తగారితో చెప్పుకొని బాధ పడుతూనే ఉంటుంది .

ఆఖరుకు కొడుకులకు కూతురు అల్లుడు సహకరిస్తున్నారు అని స్వార్ధం తో ఆలోచించి కొందరు కలిసిపోతారు కాని ఆంటీ అలా కాదు . అది వాళ్ళ అక్కా తమ్ముళ్ళకి సంబంధించినది . వ్యక్తిత్వాన్ని సందర్భానికోకరకంగా మార్చుకోకుండా ఆదర్శ మాతృమూర్తిగా నిలబడడం కొందరికే సాధ్యం .

మూడవ భాగం లో అత్తగారి వెర్షన్ వివరిస్తాను