18, సెప్టెంబర్ 2013, బుధవారం

ఏ పీ ఆర్టీసీ జిందాబాద్




ఇండియా ట్రిప్ కి వెళ్లోచ్చిన గుంటూరు వాసులు చెబుతున్నారు , అక్కడ 'ఈనాడు' ఒకింత ను వెయ్యింతలు  చేసి రాయడం తప్ప , హదావిడెం లేదు అని . మొన్న 7 వ తారీకు  హైదరాబాద్ లో రాత్రిపూట బస్సుల  బందుకు భయపడి ముందు రోజు సాయంత్రమే ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు . తీరా చూస్తె ఈడ్కోలు ఇచ్చి తిరిగి వచ్చే బంధు మిత్రులకి ఎక్కడా ఇబ్బందే లేదు. ఛా రాత్రంతా ఎయిర్పోర్ట్  లో జాగారం, తెలంగాణా వాళ్ళు ఇలా కసి తీర్చుకున్నారన్నమాట.

ప్రభుత్వం లేకపోతె జన జీవనమ్ నిలిచి పోవాలి కదా , ఏమిటో ఆర్టీసీ వాళ్ళని సమ్మె విరమించమంటే వాళ్ళు ఎన్జీవోలు ఆపితేనే అన్నారుట. మరి వీళ్ళు ఆపేస్తే జనం ఎమ్జీవోల సమ్మెని మరు నిమిషంలో మర్చిపోతారు.

ఆర్టీసీ లేకుంటే సమైక్య గళమే లేదు. కాబట్టి ఆర్టీసీ జిందాబాద్.  జీరో ఉద్యోగులను హీరోలుగా చూపిస్తున్న ఆర్టీసీ  కి వాళ్ళు జన్మంతా రుణపడి ఉండాలి.

అందుకే బొత్స బాబాయ్ ఆర్టీసీ ని ప్రభుత్వ సంస్థగా ప్రకటించి ఋణం తీర్చేసుకుంటాను అంటున్నాడు .

ఇప్పుడు ఇంకో అనుమానం , అసలు ఆర్టీసీ తో సమ్మె చేయిస్తున్నది ఎవరూ బొత్స బాబాయి కాదు కదా !!!

తెలంగాణా రాదా?



ఈ సమైక్య, తెలంగాణా ఉద్యమాల  గొడవ సంగతేంటి రా శ్రీనూ ....

తెలంగాణా రాదు అక్కా, ఇది మారదు అని ఖచ్చితంగా అని అనేసాడు ...

హ్మ్ , చిత్రంగా  శ్రీను మా ఊర్లో తన ఈడు కుర్రాళ్ళతో పోల్చితే ఉలిపి కట్టె అని చెప్పొచ్చు. మా ఇంటికి తప్ప ఇంకెవ్వరి ఇంటికి వెళ్ళడు కూడా. ఎప్పుడో పాతికేళ్ళ క్రితం  వాళ్ళ నాన్న ఉద్యోగ రీత్యా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. అంటే మా వూరు హైదరాబాద్ అయితే, వీడు అక్కడ సీమాంన్ధ్రుడు అంటే సరిపోతుంది . వీడికి వూర్లో  మా తమ్ముడు తప్ప  మిగిలిన క్లాస్మేట్స్ తెలివితక్కువ దద్దమ్మలు అని బాగా నమ్మకం కాబొలు, కాస్త కూడా లెక్క చెయ్యడు. ఇక వాళ్ళు సరే సరి.


అనుకోకుండా ఈ వారం లో  మాట్లాడాల్సి వచ్చింది, ఆ మాట ఈ మాట అయ్యాక ప్రస్తుతం కాంగ్రెస్ పెద్దలు తెలంగాణా ప్రకటించిన సందర్భంగా , సమైక్యాంధ్ర లో అక్కడక్కడా ఉన్న హదావిదిని ఈనాడు చించి చాటంత చేసి చూపిస్తున్నది  కదా. వాడి అభిప్రాయం తెల్సుకుందామని జస్ట్ అడిగాను అంతే . ఒక్క ముక్క లో తేల్చేసాడు .


అసలు ఈ అపర మేధావిని అడగడానికి కారణం ఉందండోయ్. నాలుగేళ్ల క్రితం చంద్రబాబు మహాకూటమి ని పోగు చేసి సమర శంఖం  పూరించగానే ఇంకేముంది తిరుగులేదు అన్న గట్టి నమ్మకం తో ఎంట్రా సీనూ సంగతీ అని పొరపాటున అడిగాను . అక్కోయ్ పక్కా మళ్ళీ వై ఎస్సే అని ధంకా భజాయించాడు. చా అంత  లేదేమోరా !!! (వీడికి ఊర్లోని మా సామాజిక కులం  కుర్రాళ్ళు అంటే అస్సలు పడదు కాబట్టి చంద్రబాబు ని కర్వేపాకులా  తీసేస్తున్నాడే అని అనుమానం అన్నమాట )


కాదక్కా జనంలో  దీపం పధకం, ఇందిరమ్మ ఇల్లు ఇంకెవో  యజ్ఞాలు లో తెగ ఉబ్బి తబ్బిబ్బయ్యారు , ఇంక వైయెస్సు కి తిరుగే లేదు అని బల్ల విరక్కోట్టేసాడు. అయినా ఇంకోసారి బాబు సంగతిరా అని కాస్త మెత్తగా  అడిగాను.   కాస్త అయినా జాలి దయా లేకుండా తెలుగు బాబు కి మళ్ళీ  చీఫ్ అయ్యే యోగమే లేదక్కా అని చప్పరిన్చేసాడు .


ఆ కారణంబేవిటా  అని ఆరాతీస్తే , మన హైటెక్కు బాబు కి శని గండం పట్టేసిందట . ఏవిటో ఆ శనీశ్వరుడు పోతూ పోతూ దేబ్బేసి పోతాడుట . అలా అలిపిరి లో ఉగ్ర వాదుల దాడి లో  చావు తప్పి  వెంటనే తొందరపడి  సానుభూతి ఓట్ల కోసం ముందస్తు హడావిడి చేసిన తప్పిదం వల్ల  కన్ను లొట్ట పోయిమ్దిటా . అలా కాక మామూలుగా మిగిలినా ఆర్నెల్లు ఆగి ఉంటె గెల్చేసే  వాడే నుట  కాని మరి శని కుదురుగా ఉండనిస్తే కదా .

హతవిధీ మరి టీ డీ పీ ఇక గెలవదా !!!! ( ఇంకా నయ్యం , మా ఇంట్లో ఎవరన్నా ఈ సంభాషణ వింటే వీడికి బడితె పూజే బహుమానం )

అంటే అక్కా  ఇంకెవరన్నా అయితే పార్టీ గెలవచ్చేమో కాని, బాబు ఉంటె మాత్రం కధ  కంచికే అని చావు కబురు చల్లగా వినిపించాడు.

ఎలక్షన్ అయ్యాక తెలుస్తుంది లే , దొరికాం కదా అని నీ జాతకాల పాండిత్యం అంతా వదలకు అన్నా చిరాగ్గా .

అసలు వీడు డిగ్రీ చదవడం మానేసి జాతకాల పుస్తకాలు నమిలేసాడు.  అవి అయ్యాక పూజలు పిచ్చోకటి . ప్రముఖ ఆస్ట్రాలజర్ అని ఫీలయిపోతాడు కూడాను.


ఇంతలో ఎలక్షన్ లో వైఎస్స్ హైదరాబాద్  వీసాల డైలాగ్ కి  బాబుకి మహా బూడిదే మిగిలింది .  అబ్బా మా సీనుగాడు చెప్పినట్లే ఇక బాబు పనయిపోయిందా అని కించిత్ అనుమానం కలిగి కారణాలు పీకి పందిరేస్తే అర్ధం అయ్యింది. కాంగ్రెస్ లో సామూహిక మరియు సమైక్య  అవినీతి కి, బాబు  ఎప్పటికి పోటి ఇవ్వలేడు. అసలు ఇంట్లో వాళ్ళకే దిక్కులేదు . ఇంకెక్కడ అధికారం  చేతికోచ్చేది .

ఇక తెలుగు దేశం ప్రజల ఓట్లు  వెలుగు లో కొచ్చేదేలా అంటే  ఉడిపి హోటళ్ళు.. ఒక రాజకీయ విశ్లేషణ.. ! చదివి తీరాల్సిందే .


ఇప్పుడు వీడు ఏ నమ్మకం తో చెప్పాడో కాని తెలంగాణా రాదు అని , ఈ సీమాంధ్ర ఉద్యోగులంతా కలిసి సీమాన్ధ్రని ఇంకో యాభై ఏళ్ళు ఎనక్కి తీసికేల్లెట్లున్నారు.


ఒక అమ్మకం లేదు , కొనడం లేదు. ఆ చేసేదేదో బంగారం షాపులోల్లతో బందు చేయిస్తే జనం లో ఫాలోయింగు పెరుగుతుంది కాని,  హాస్పిటల్లో ఉన్న పురిట్లో  పసికందులను వరుసగా  పడుకో పెట్టి సమైక్య  ఉద్యమం ని వీధి డ్రామా స్థాయికి దిగజార్చడం ఏమిటో.




9, సెప్టెంబర్ 2013, సోమవారం

సీమాంధ్ర ఉద్యమం - తిప్పడు వచ్చాడు, వెళ్ళాడు

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యెక తెలంగాణా ను ఈ ఆగస్ట్ 30 న ప్రకటించిన వెంటనే పెద్దగా సీమాంధ్ర  నుండి స్పాదన లేకున్నా చిన్నగా బందులు, నినాదాలు మొదలయ్యాయి.


సమైక్య ఉద్యమం కాని, హైదరాబాద్ ఉద్యమం కాని జరగాలి , కాదనే వారెవరూ లెరు. కాని ప్రజల భాగ స్వామ్యం తో జరగాలి , రాజకీయ వర్గాలు నేరుగా పాల్గొనాలి. ఈ సమస్యలో భావ సారూప్యత ఉన్న అన్ని రాజకీయ పార్టీలు సంయుక్తంగా పోరాడాలి. ఇవేవి లేకుండా ఉద్యోగుల ముసుగులో రాజకీయ పార్టీలు జరిపే రచ్చ కాకూదడదు. 

కొద్ది మంది ఎన్జీవోలు విధులు బహిష్కరించాల్సింది గా ఇచ్చ్చిన పిలుపు కు దాదాపు తొంబయి శాతం ఉద్యోగులు విదులకి దూరం గా ఉన్నారని సమాచారం , కాని వీరిలో ఎంతమంది సమైక్యవాదులు అని నిర్ధారించడానికి వీలు లేదు. ప్రస్తుతం వీరి నిలజీతాలను ప్రభుత్వం నిలిపివేసింది కాని, రాష్ట్ర విభజన జరిగినా .జరగకున్నా వీరి జీతాలు వీరికి జమ అవుతాయి, రెండు సందర్భాలలోనూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రమె  ఉంటుంది కాబట్టి.  వీళ్ళని కాదంటే చంద్రబాబుకి పట్టిన గతి పట్టిస్తారు . 


కేవలం ఉద్యోగులు మాత్రమె , సెక్యురిటీ మధ్య వెళ్లివచ్చిన సభ కి ప్రాధాన్యత యెంత? వారు సీమంధ్ర ప్రజల్లోని సమైక్యవాదులందరూ పాల్గొనాల్సిన అవసరం లేదా?  లేక మిగిలిన ప్రజలు వారి స్థాయికి తగరనుకొన్నారా ?



 ఈ మీటింగు కి 'సేవ్ సీమాంధ్ర' అని పెడితే ఇంకాస్త సవ్యంగా, కన్ఫ్యూజన్ లేకుండా ఉండేది .'సేవ్  ఆంధ్రప్రదేశ్' అంటే  సమైక్యాంధ్ర అని కాకున్నా పాత రాష్ట్రమే అని వీరి భావన అయ్యుండొచ్చు . ఆంధ్ర ప్రదేశ్ కి ఇప్పుడు రెండురూపాలు ఉన్నాయి , ఒకటి  విభజన ప్రకటనకి ముందు మరియు రెండవది తర్వాత . ఈ ఎన్జీవోలకి విభజన తర్వాతి ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు .

 వీరు కేవలం విభజన సమయం లో హడావిడి చెయ్యడానికి కెసిఆర్ పుణ్యమా అని రోడ్దేక్కినవారు మాత్రమె . అలాగే సేవ్ సీమాంధ్ర అంటే హైదరాబాదులో ఉన్న సమైక్యవాదులు, ఇంకా హైదరాబాదుతో మాత్రమె పని ఉన్న సమైక్యవాదులు కలవరు . సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ఈ బంద్ కి పూర్తిగా దూరం , ఎందుకంటె కేంద్ర ప్రభుత్వం జీతం   చస్తే జమ చెయ్యదు కాబట్టి .  ఇదే ఉద్యోగుల సమ్మెలో పెద్ద డొల్లతనం


మొత్తానికి   'సేవ్  ఆంధ్రప్రదేశ్' సభకి సీమాంధ్ర కి సంబంధం అసలు లేదా అంటే ... వివరాల్లోకి వెళ్ళాలి


ఎవరో చెప్పినట్లు సభలో ఒక్కో భాగానికి ఒక్కో ప్రముఖుడి పేరు, తెలంగాణా వారితో సహా కలిపి పెట్టగానే సరిపోదు, మాట్లాడే మాటల్లో , చర్చల్లో మొత్తం తెలంగాణా తో కలిపిన ఆంధ్ర ప్రదేశ్ యొక్క  మంచి చెడులు ఉండాలి. విభజన వల్ల సమైక్యవాడులనబడే కొద్దిమంది కి వచ్చే నష్టాలను మాత్రమె చర్చించడం హాస్యాస్పదమ్.


ఇందులో తెలంగాణా, సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు, సమస్యలు ఎంతవరకు పరిగణనలోకి తీసికోబడ్డాయి ??? అంటే సమాధానం లేదు .  విభజన వల్ల లాభాలు, నష్టాలు రెండూ ఉంటాయి. కేవలం నష్టాలు మాత్రమె చర్చించడం తప్పుకాదు , కాని అటు తెలంగాణా, ఇటు కొంతవరకు సీమాంధ్ర ని వదిలేసి కేవలం ఒక వర్గానికి మాత్రమె పరిమితం అయితే అది సమైక్యాంధ్ర సభ అవుతుందా?


సరే విభజన వల్ల  వచ్చే నష్టాలు సాధికారంగా వివరించడానికి తగినట్లుగా అన్ని వర్గాల ఇంజినీర్లు, మేధావులు ప్రసంగించారా? కనీసం సదరు ఎంజీవోలు ప్రజలతో చర్చించారా?


 ఈ మాత్రం సభలు సీమాంధ్ర లో ఇంతవరకూ పెట్టలేక పోయారేమి ? వీళ్ళకంత దృశ్యం లేదు , రాజకీయ పార్టీల కూలీలు గా ఉద్యమం చేస్తున్నారు, రాజకీయ నాయకుల్లానే వీరు విస్తృతమైన ప్రయోజనాలగురించి మాట్లాడడం లేదు . అలాగే సమైక్యాంధ్ర లో ఉన్న తెలంగాణా వారి సమస్యల గురించి వీరు చచ్చినట్లు మాట్లాడాల్సిందే , నిజంగా సమైక్యవాదులు అయితె. కాని ముందు చెప్పినట్లు గా వివిధ రాజకీయ వర్గాల తొత్తులు ముందుంది నడిపించిన కార్యక్రమాలకు మాత్రమె వీరు పరిమితం

 కే  సి ఆర్ పుణ్యమా అని ఎన్జీవో లు పని విరామం ప్రకటించి ఊరికే కూర్చుంటే విధులకి వెళ్ళాలి కాబట్టి (ఉస్మానియా విద్యార్ధులు కొందరితో  పొల్చడం తప్పవుతుందా?) అక్కడక్కడా గర్జిస్తూ ఈ వారం లో హైదరాబాదులో  'సేవ్  ఆంధ్రప్రదేశ్' నినాదాన్ని వినిపిస్తూ పెద్ద సభ నిర్వహించారు.


వీళ్ళు ఉద్యమం, ఆందోళన అంటే   ప్రజలకి అన్ని ప్రభుత్వ సర్వీసులు నిలిపివేసి , ప్రజలని వేధించడమే అని క్రొత్తగా కనిపెట్టారు.కొన్ని సర్వీసులు సెంట్రల్ గవర్నమెంట్ఆధ్వర్యం లో ఉన్నాయి కాబట్టి జనం కొద్దిగా ఊపిరి పీల్చుకో గలుగుతున్నారు. హైదరాబాదు లో ఒక నెల సమ్మె జరిగితే గగ్గోలుపెడతారు కాని సీమాంద్ర ఉద్యోగులు మొత్తం నెలల తరబడి విధులకు దూరంగా ఉంటె , అక్కడి ప్రజల ఇబ్బందులగురించి అడిగే దిక్కులేదు.






2, సెప్టెంబర్ 2013, సోమవారం

బందోత్సవాలు

ఈనాడులో తాజావార్త :  "విజయవాడలో రేపు ప్రైవేటు ఆస్పత్రుల మూసివేత "

ఇదేంటబ్బా  గత నెలరోజులుగా జరుగుతున్న సమైక్యాంద్ర ఉద్యమం మూలంగా బస్సులు లేక, ఆటోలు అందకా ఎప్పుడో మూసివేసారుగా చాలా ప్రైవేట్ క్లినిక్కులు అని సందేహం వచ్చింది. ప్రస్తుతం ముందే డబ్బులు చెల్లించిన వారు ట్రీట్మెంట్ కోసం ఎదురు చూస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి. ఫోన్ చేస్తే పలకదు , అక్కడెవరూ లేరని నిర్దారించేసుకొని వాళ్ళే మల్లి ఫోన్ చేసే వరకు గోళ్ళు కొరుక్కుంటూ కూర్చోడమే (డెంటల్ ప్రాబ్లెమ్ అయితే ఆ ఆప్షన్ కూడా ఉండదనుకోండి ) .   


ఇప్పుడు అఫీషియల్గా పెద్ద పెద్ద కార్పోరేట్ హాస్పిటల్స్ కి కూడా గిరాకీలు తగ్గిపోయాయి కావచ్చు. పోష్ గా ఉంటుందని సమైక్యాంద్ర కి మద్దతుగా అని కూడా చెప్తున్నారు.లేదంటే  ఆంధ్రాకి కొత్త రాజధాని వస్తే  ప్రైవేట్ హాస్పిటల్స్ బిజినెస్ దెబ్బతింటుందేమో ?


ఒక్క ఆర్టీసీ బందు, ఇన్ని తప్పనిసరి బందులను తెస్తుందా అని బోలెడంత ఆశ్చర్యం వేసింది. 

ఆర్టీసీ ఎందుకు బంద్  చేస్తోంది అంటే వాళ్లకి కి వచ్చే ఆదాయం లో సింహభాగం తెలంగాణా /హైదరాబాదు నుండే వస్తున్నది(ట ). మనకి కూడా రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ కి బస్సు/టోల్  చార్జీలు పెరిగిపోతాయి. అలాగే తెలంగాణా, హైదరాబాదుల్లో ఉన్న ఆంధ్రులకి కూడా స్వగ్రామం వచ్చి వెళ్ళడానికి ఖర్చులు పెరుగుతాయి కదా.


అయినా అప్పుడు హైదరాబాద్ కి ఎందుకు వెళ్తాం..హ్మ్ ఎయిర్పోర్ట్  కి అంటే తప్పదు . త్వరగా ఆంధ్రా  కి (లేదా సమైక్యం లో మా ఆంధ్రా కి )ఇంటర్నేషనల్  ఎయిర్పోర్ట్  వచ్చేస్తే బాగుణ్ణు. ఇంకేమున్నాయబ్బా హైదరాబాదు లో !!!!

బంధువులు ఉన్నారు కాని , వాళ్ళే చక్కగా ఊర్లకి రావాలి కాని మనమెందుకూ వెళ్ళడం . అదీ సంగతి సగటు ఆంద్ర పౌరుడికి హైదరాబాదుతో పనేం లేదు. అక్కడ వచ్చే ఆదాయం తో ఇక్కడ అభివృద్ధిగట్రా చేస్తారనుకోడం భ్రమ. 


సమస్యలేమయినా ఉంటె గింటే ఉద్యోగులకే.  దాచుకొన్న సేవింగ్స్ అక్కడ హైదరాబాదులో  ఇన్వెస్ట్ చేసిన వుద్యోగులకయితే ఇంకాస్త కష్టమూ.  అయినా ఏదయినా స్థలం కొనుక్కునే ముందు, దేశం లో ఎక్కడయినా  కాని పనికొస్తుందా లేదా అని చూడకుండా రేటు పెరుగుతుందని మాత్రమే కొనడం శాడిజం క్రిందకి వస్తుంది . దాని వల్ల ఇప్పుడు భూముల అసలువిలువ లెక్క కట్టడం మానవ మాత్రులకి సాధ్యం కాదు. సామాన్యుడు ఈ పోటీలో  కాస్తంత చిన్న గూడు కూడా కట్టుకోలేడు . పంట పండించే రైతుకూలీ కి పొలం దొరకదు.


26, ఆగస్టు 2013, సోమవారం

ఆంధ్రా లో సమైక్య హింస నుండి కాపాడే దేవుడా కే సి ఆర్ ?



న్యూస్ పేపర్స్ సమైక్య ఉదయం తీవ్రత గురించి అంతా ఇంతా కాదని చెప్తోంటే ఏమిటో అనుకొన్నాం గాని , ఒక్కో కధ వింటుంటే నవ్వు వస్తుంది. వీళ్ళకి ఆవేశం వచ్చి బందులు చేస్తుంటే సామాన్యజనం పట్టించుకోవట్లేదని ఉద్యమకారులు తీవ్రంగా పగ బట్టేసారు.  ముందు ఊర్లకి బస్సులు ఆపేశారు. కచ్చితంగా తెలిసి చస్తుంది ఇక అనుకొన్నారు కాని, బస్సులు వచ్చినా రాకపోయినా సగమందికి పెద్ద లెక్క కాదు, ఇక షాపులు మూయించి పడేసారు . నెలకొకసారి కొనుక్కునే జీవులు కాదుగా కాస్త చిరాకు పడ్డారు కాని, అదేన్నాల్లు లే, గవర్మెంట్ ఉద్యోగం కాదుగా కిరాణా కొట్టు . ఏదో బస్సుల్లేవు కాబట్టి పక్కోరికేల్లి కొనుక్కోలేరులే అని నాలుగు రోజులు కొట్టు కట్టేసి కావాల్సిన నాలుగు రకాలు వండుకొని సుష్టుగా తిని రెస్టు తీసుకొన్న దుకాణు దారులు మళ్ళీ విధుల్లోకి అదేనండీ వ్యాపారం లోకి వచ్చేసారు. ఇక ఆటోల వాళ్ళపై పది ఎడుస్తున్నారట బాగు పడి పోతున్నారని , వాళ్ళకీ ఉపాయం తట్టింది రోజుకో కూడలి దగ్గర ఒక్కో గ్రూప్ బంద్  పాటిస్తారు, మిగిలినవాళ్ళు బంద్  పండగ పుణ్యమా అని నాలుగు రాళ్ళు వెనకేసుకునే హడావుడి మామూలే .

రోగాలకి ట్రీట్మెంట్ తీసుకొనే వాళ్లకి ఆటోల ఖర్చులు అదనం కాక, అసలు గమ్యం చేరుతారో లేదో తెలియదు . ఇంకొందరికేమో  బీరువా నిండా చీరలున్నా పాడు బందు షాపింగ్ కి కూడా వెళ్ళలేకపోతున్నాం అని దిగులు జ్వరం పట్టికుంది కాని ప్రచారంలో ఉన్నట్లోల్ అయ్యో అయిదరబాదు  పోతుందే అన్న బెంగ మాత్రం లేదంటే నమ్మండి .

ఇది చాలదన్నట్లు కాస్త పెళ్ళిళ్ళు ఫంక్షన్ల సీజనాయే . అక్కడా ఖాళీ కుర్చీలు వెక్కిరిస్తున్నాయట . అంటే

ఇదికాక సచ్చినోళ్ళు ఇంకో రెండ్రోజుల్లో కరెంట్, నీళ్ళు కూడా ఆపెస్తారంటా అని ఫోన్ లో చెప్తుంటే పకాల్న నవ్వొచ్చింది. పాపం ఈ గొడవేమో గాని జనాలు టీవీలకు అతుక్కు పోయారు. మా పిన్ని చెప్తున్నారు, వాడు  డి ల్లీ పొయ్యాడు ఏం చేత్తాడో అని అంటుంటే, వాడా వాడెవడూ అంటే కే సీ ఆర్ అట . మరి ఈ కరెంటూ, నీళ్ళ కష్టాలు తీర్చడానికి ఆంధ్రలో మనిషే లేనట్టు పాపం సగటు సీమాంధ్ర కేసీఆర్ వైపు ఆశగా చూస్తోంది . వార్నీ వీడింత పాపులర్ అయ్యాడా ఆంధ్రలో అని ముక్కున వేలేసికోవాలి.

ఏదేమైనా అన్ని పార్టీల ఆశలూ ఆంధ్ర పైనే ఉండడం ఇప్పుడు ఆంధ్రులకి శాపం అయ్యింది . ఎక్కడ పక్కోడి  మాటలు నమ్మేస్తారో అని పతోక్కడూ ఉద్యమం మొదలెట్టాడు . ఇప్పుడు దీక్ష చేస్తే వచ్చే మైలేజీ  ఎలక్షన్లో పదికోట్లు పంచినా రాదనీ అర్ధమై పోయింది . అందుకే నాలుగు రోజు కడుపు మాడ్చుకొని ఉద్యమ నేత అయిపోవాలని తపన పడుతున్నారు .

ఇంత  చేస్తున్నా ఆంధ్రులకి ముందుకొచ్చి ఇదేంటి అని అడగాలని తోచదో ఏంటో . కరెంటూ నీళ్ళూ రాకుండా చెయ్యడమేంటి వీళ్ళ తిక్క తగలెయ్య, రాష్ట్రం గబ్బు పట్టి పోతది . 

18, ఆగస్టు 2013, ఆదివారం

ఫెమినిజం లో అమ్మా , అత్తగార్లు -2

ఫెమినిజం లో అమ్మా , అత్తగార్లు మొదటి భాగం ఇక్కడ :


ప్రవీణ చెప్తూ ఉంటె చాలా కోపం వచ్చింది అప్పట్లో . అంకుల్ సరే అంటీ కూడా ఇలా చేయవచ్చునా  . నాకెంత అభిమానమో ఆమె అంటే , ఒక్కసారిగా ఇలా మారిపోయారా అని చాలా కష్టం అనిపించిన్ది.

సరే  ప్రవీణ తమ్ముల్లలో ఇద్దరు నాకు బాగా క్లోజ్. వాళ్ళలో రమేష్ కి అయితే  ప్రవీణ  భర్త ట్రైనింగ్ ఇప్పించి, తానె పూర్తిగా సహకరించి ఒక మల్టినేషనల్ కంపెనీ లో ప్రోగ్రామర్ గా జాబ్ తెప్పించారు . చిన్న తమ్ముడు అయితే సెలవుల్లో తప్పక ఒక వారం వచ్చి వెళుతున్నాడు . కాని అమ్మ మాత్రం మొదటి సారి ప్రెగ్నెంట్ గా ఉన్నపుడు ఒక నాలుగు రోజులు అదీ కూతురు బ్రతిమిలాడితే వచ్చి వెళ్ళారు. తనే డెలివరీకి , పండుగలకి అని పుట్టింటికి వెళ్లి వస్తు ఉంది .


 మరి తమ్ముళ్ళు ఏమంటున్నారు అంటే, వాళ్ళు అమ్మకే సపోర్ట్ ...తన బాధ తనది అని అంటున్నారన్నది . ఇది ఇంకో షాక్ .

 మీ అమ్మకి  చక్కగా డబ్బులు అవీ ఇస్తూ కాస్త మంచి చేసికోవచ్చు కదా కాస్త మారతారేమో అని అడిగి చూసాను . నవ్వ్వేసింది , అలాంటివి చేస్తే మా అమ్మ ఇంకోసారి నా ముఖం కూడా చూడదు. ఛీ కొడుతుంది ఇంకేం లేదు అన్న తర్వాత ...ఇదెక్కడి  సమస్య అనిపించింది .


 ఆంటీ  నాకు ప్రశ్నగానే మారిపోయారు . తర్వాత ఒకసారి మా ఇంటికి నన్ను చూడ్డానికి వచ్చారు , ఇంకోసారి గుడిలో కనిపించారు. అదే ప్రేమ ..వాల్లమ్మాయి  గురించి కూడా సంతోషం గానే మాట్లాడారు . ఆమెని నేనెక్కడో అర్ధం చేసికోలేదనిపించింది .


చాలా రోజులు పట్టింది ఆమె అంతరంగం అర్ధం కావడానికి. ఒక ఆడపిల్లకి తల్లిగా మన సంస్కృతి ఇన్నాళ్ళు పెళ్లి చేసి అత్తారింటికి పంపెవరకే మన అమ్మాయి అని నూరి పోసింది . బహుసా అదే గుడ్డి నమ్మానేమో , ఆమెని అర్ధం చేసుకోవడం లో పొరపాటు జరిగింది .

ఆవిడకి నలుగురు పిల్లలు , నలుగురూ ఆడపిల్లలో మగపిల్లలో అయితే ఏ గొడవాలేదు కాని ముందు అమ్మాయి తర్వాత ముగ్గురు అబ్బాయిలు. కాని మగపిల్లలతో సమానంగా, ఇంకా కాస్త ఎక్కువ ప్రేమ అభిమానాలు కలిపి తనని పెంచారు . మగపిల్లలకి ఆడపిల్లగా, అక్కయ్యగా తనకెంత విలువ ఇవ్వాలో కూడా చక్కగా నేర్పించారు . అప్పటి అందరు ఆడవాళ్ళ లా భర్త సంపాదిస్తుంటే  కేవలం పిల్లల్ని బాధ్యతగా పెంచడమే కాకుండా, గేదెల్ని పెట్టుకుని , ఇంకా అంకుల్ కి వ్యవసాయం లో కూడా సాయం చేస్తూ తన సంతోషం అంటా పిల్లల్లోనే చోసుకొన్నారు. నలుగురిని పెంచాలి కాబట్టి సంవత్సరానికి   రెండు చీరల్ని మించి  ఎప్పుడు కొనుక్కోలేదు.


 తను  ఉద్యోగం మారి గుంటూరు కి వస్తే ఫామిలీ షిఫ్ట్ చేసి మరీ తనతో ఉన్నారు. అంకుల్ రోజు వెళ్లి వచ్చేవారు. కూతురు పెళ్లి విషయం లో యెంత ఆలోచన చేసారో నాకే తెలుసు . కట్నం విషయానికి వస్తే ఆయన మాటలు నవ్వు తెప్పించేవి . కట్నం ఇవ్వనన్నారు సరే, వచ్చి వెళ్ళే మారేజ్ బ్రోకర్స్ కి కూడా పైసా ఇవ్వనన్నారు ముందే . ఆయన పెంపకం పై ఉన్న నమ్మకం అదీ .

 పెళ్లి  తర్వాత కూడా అత్తా మామలేమి తన బాధ్యతా తీసికోలేదు , వీళ్ళే ఉన్నారు తనకి  భర్త ఉండే చోటుకి బదిలీ అవడానికి ముందువరకూ . కాని ఒకరోజు అలా వదిలేసి వెళ్ళిపోయారు . ఎందుకంటె!!!!


మన సంస్కృతిలో కూతురికి , కొడుకు కి చాలా తేడా ఉంది . కొడుకు కి తల్లిదండ్రులంటే బాధ్యత, జవాబుదారీ ఉండాలి . వారికి  సంపాదన పై హక్కు, కొండకచో అజమాయిషీ కూడా ఉండి  తీరాలి. కాని  అంతే కష్టపడి చదివించి, మంచి ఉద్యోగంలో చేరాక పెళ్లి చేసి అల్లుడి కాళ్ళు కడిగి నెత్తిన నీళ్ళు చల్లుకోవాలి . అమ్మాయి భర్త అడగ్గానే తన మరిది వీసా ప్రాసెస్ కోసం   అకవుంట్ ఖాళీ చేసి ఇచ్చెయ్యాలి . అక్కడే ఉన్న అమ్మా నాన్నకి చెప్పనవసరం లేదు , ఎందుకంటే ఇప్పుడు తన కుటుంబం వేరు . కాని తన కుటుంబం అనుకునే ఆ అత్తా మామలు కాని , భర్త కాని వచ్చి తన బాధ్యత  తీసికోరు .

బహుసా అందుకేనేమో ప్రవీణ వాళ్ళ అమ్మ ఇప్పుడు మవునం గా వదిలి వెళ్ళడం లో  నాకు  ఒకే అర్ధం కనిపించింది . హక్కులు అత్తా , మామ కుటుంబం మరియు భర్తవి అయితే, బాధ్యతలు కూడా పూర్తిగా వారివే. ఇప్పటి వరకు కష్టపడింది చాలు . మిగిలిన పిల్లల సమస్యలు చూసుకోవాలి కాబట్టి కూతురు విషయంలో తన ప్రమేయం ఇంచుక కూడా అక్కర్లేదు అని తప్పుకొన్నారు.  ఈ నిర్ణయానికి రావాలంటే ఒక స్త్రీకి యెంత ఆత్మాభిమానం కావాలి !!! అంతకుమించిన జీవితానుభవం, ఆలోచనా పరిణితి ముఖ్యమ్.

అమ్మాయి అంటే గారాబం గా పెంచి ఇంకో ఇంటికి దానం చేసే ఆస్తి కాదు. తనకూ వ్యక్తిత్వం వుందని అవతలి వాళ్ళు తెలుసుకోనంత కాలం ప్రవీణ కూడా తనకి అందరి అమ్మాయిలకు ఉన్న లాంటి కన్న తల్లి ప్రేమ దొరకట్లేదు ఎందుకు అని అత్తగారితో చెప్పుకొని బాధ పడుతూనే ఉంటుంది .

ఆఖరుకు కొడుకులకు కూతురు అల్లుడు సహకరిస్తున్నారు అని స్వార్ధం తో ఆలోచించి కొందరు కలిసిపోతారు కాని ఆంటీ అలా కాదు . అది వాళ్ళ అక్కా తమ్ముళ్ళకి సంబంధించినది . వ్యక్తిత్వాన్ని సందర్భానికోకరకంగా మార్చుకోకుండా ఆదర్శ మాతృమూర్తిగా నిలబడడం కొందరికే సాధ్యం .

మూడవ భాగం లో అత్తగారి వెర్షన్ వివరిస్తాను 

30, ఏప్రిల్ 2013, మంగళవారం

బ్లాగు వ్యాఖ్యల కధ


చాలా మంది  వాదనకు భయపడి అసలు అభిప్రాయాలు ఉన్నా వ్యక్త పరచడం మానేస్తున్నారు అని, ఇంకొందరు అజ్ఞాత ఆప్షన్ లేక  , ఆఫీసులో గూగుల్ ఓపెన్ అవ్వక వ్యాఖ్యానించడం లేదని చెప్తారు . మరి అయితే మాట్లాడేవాళ్ళు ఎలా ఈ అవరోధాలు దాటి వస్తున్నారు అన్నది సమస్య . వ్యాఖ్యానించ  దలుచుకొన్నవారు ఇలా ఎలా మౌనమ్గా ఉంటారు ? అది మనసుకి ముసుగు వెయ్యడమే కదా. మనసుకు ఇష్టం  లేకపోవడం వేరు , ఇష్టం ఉంది ముసుగు వెయ్యడం వేరు . ఇది మన భ్రమే కావచ్చు. నిజంగా వ్యాఖ్య వ్రాసేంత  బలమైన అభిప్రాయం ఉండకపోవచ్చు . మనకెందుకొచ్చిన గోల అనుకోవడం అసలు కారణం . ఒక వ్యాఖ్య   చర్చలోకి మళ్ళితే ఎక్కడ/ఎప్పుడు తేలుతుందో , అలా ఆ వ్యాఖ్యలన్నీ అనుసరించడం లో  బోలెడు సమయం వృధా అని చక్కని వ్యాఖ్యాతలు మవునం వహిస్తున్నారా అన్న అభిప్రాయమే చాలా రోజులు ఉంది . ఇదే ప్రశ్నను 'జాజిమల్లి' బ్లాగర్ మల్లీశ్వరి  గారిని అడగ్గా ఇలా సమాధానం చెప్పారు .
వ్యాఖ్యలు కానీ టపాలు కానీ ఎవరి ఉద్వేగాల బలాన్ని బట్టి వారు స్పందిస్తారు. ఎన్ని రాజకీయాలున్నా అది ఊపిరాడ నివ్వదు

ఇక నొ. కా బ్లా స అని , గుం  వ్యా కా స అని  రక రకాల వ్యాఖ్హ్యాల సంఘాలు పేర్లు వచ్చాయ్ . ఇందు మూలంగా నో కా బ్లాస అధ్యక్షులు అర్ధం చేసికోవాల్సింది ఏమిటి అంటే , పలానా వ్యాఖ్యాతల  ఉద్వేగాలను మీరు టచ్ చెయ్యడం లేదు, చాలా సాఫ్ట్ గా సున్నితంగా వ్రాసిన టపా  నేమలీకతో వ్రాసిన వెన్నలా చల్లగా మనసులోకి వెళ్ళింది కాని వుద్వేగంలా తిరిగి  రావడం లేదు అని .

ఇక గుం  వ్యా కా స హడావిడి చూసి డిప్రెషన్ కి వెళ్ళడం ఇష్టం లేని ధైర్యవంతులయిన రచయితలు మాకెందుకు వ్రాయరు వ్యాఖ్యలు అని యుద్ధం చేస్తారు . ఖచ్చితం గా చెప్పాలంటే సింగిల్ గా ఉన్న వారు ఐ యాం సింగిల్ , రెడీ టు  మింగిల్  అని అనౌన్స్ చేసినట్లుగా. అప్పుడు ఆ సింగిల్ ఈజీ టార్గెట్ అని కన్ఫర్మ్  అవ్వుద్ది , ఎవరయినా  పని చూసుకోవడానికి ప్రోసీడ్ అవుతారు. ఇలా అనడం  ఎందుకంటె అభిప్రాయం అనేది చిన్నదో పెద్దదో ఉద్వేగం  రావాలి కాని ఇలాంటి రిక్వెస్ట్ లు ఫేక్ వ్యాఖ్యలనే తెచ్చి పడేస్తాయి . 

మనం టపా వ్రాసినపుడే సంతృప్తి వస్తుంది . వ్యాఖ్యలు ప్రోత్సాహం అయితే ఏ వ్యాఖ్య లేకుండడం, లేదా తక్కువ ఉండడం  అంతకన్నా శుభం , మీరు ముఖ స్తుతికి తేలిగ్గా  పడిపోరనీ , గుంపులు గోవిందయ్యలుగా ఉండరనీ  కన్ఫర్మ్ చేసిసికున్నారన్న మాటే . కాబట్టి పండగ చేసుకోవాలి కాని నొచ్చుకోవచ్చునా !!!

29, ఏప్రిల్ 2013, సోమవారం

ఫెమినిజం లో అమ్మా , అత్తగార్లు

ఏంటమ్మా నువ్వు చెప్పేది , అంకుల్ నీతో అలా  ఎలా చెప్తారు. చెప్పడమే తప్పు కాదా ఆయన్ని మనడ్లించడం మానేసి నిజమని నమ్మి నాకు చెప్తున్నావా?  ఆ అమ్మాయి అలా చేసే తత్త్వం కానే కాదు.  ఒకవేళ చేసినా కూతురుగురించి ఎవరయినా అలా చెప్తారా? నీకర్ధం కాలేదే ? ఛ  ఆయన ఇలా మాట్లాడుతారనుకోలేదేప్పుడు . అయినా ఆ విషయం నీకెందుకు చెప్పారు?  ఏమో ఆయనే ప్రస్తావించి చెప్పాడు  అమ్మ సమాధానం .

అమ్మతో నాకెప్పుడు ఇది సమస్యే, అమ్మే కాదు తన చుట్టూ  అందరు దాదాపు ఇంతే, ఎవరో ఏదన్నా చెప్తే కాస్త కూడా ఆలోచించరు. నమ్మేస్తారు అదేమంటే మనకెందుకు వాళ్ళ గోల అని మాట తప్పించేస్తారు.

అంకుల్ నా కాలేజ్మేట్  ప్రవీణ వాళ్ళ నాన్న గారు. సాధారణం గా ఎవరితో మాట్లాడరు , స్నేహం కూడా చెయ్యరు. స్కూల్లో హెడ్మాస్టర్ గా చేస్తున్నారప్పటికి. తన పనేదో తనది. ఉద్యోగం తో పాటు వ్యవసాయం కూడా చేస్తూ నలుగురు పిల్లలని జాగ్రత్తగా పెంచారు. మొదటి సారి వాళ్ళింటికి వెళ్ళినపుడు ఆయన మాటలు చిత్రం గా తోచాయి. అందరు భోజనాలు చేస్తుండగా సరదాగా మాట్లాడుతూ కలిసి తింటే పచ్చడన్నం కూడా కడుపు నింపేస్తుంది అమ్మా అని ఇంకా మా ఇంటికి ఎవరైనా రావడం చాలా అరుదు అని సంతోషంగా కలిసిపోయారు .  ఇక ఆంటీ చెప్పక్కర్లేదు సాయంత్రం దాకా అన్నిపనులు  ఆడుతూ పాడుతూ చేస్తూ , వంటిల్లు సర్ది నిద్రపోయే సరికి పది దాటుతుంది . అయినా తెల్లవారి మేము లేచేసరికి చక్కగా స్నానం అదీ చేసేసి తలదు వ్వుకొని, అంతే కాదు అప్పటికే చావిట్లో గేదేలదగ్గర పనిచేసేసి పాలు గిన్నె తో కనిపించేస్తారు . అయినా ఎండాకాలం ఏమో ముందురోజు అట్టే పెట్టిన మల్లె పువ్వులు ఆంటీ తలలో నలగకుండా ఫ్రెష్ గా పలకరిస్తూ ఉంటాయి . మళ్ళీ అందరికీ టిఫిన్లు పెట్టేసి వంట కానిచ్చి కాస్సేపు మాతో సరదాగా గడుపుతారు . రోజంతా పిల్లల కోడిలా కబుర్లాడుతూ నిండుగా , చిరునవ్వుతో అలుపనేది లేకుండా అందరికీ  తలలో నాలుకలా వుంటూ పనులు కానిచ్చేస్తారు .  అసలు కాలేజ్ లో  ఆంటీ పరిచయమే చిత్రంగా జరిగింది . ఏ వూరు అని , అలా మా అమ్మ వాళ్ళు కొంచెం తెలుసు అని చెప్పారు. అలా వాళ్ళ పక్కూరిలో ఉన్న మా తాతయ్య గారి వివరాలు చెప్పగానే అయితే మీ  పెద్దమ్మగారే నమ్మా నాకు, అంకుల్ కి  పెళ్లి కుదిర్చింది అని బాగా దగ్గరయి పోయారు. ఎగ్జామ్స్ అయి ఇంటికి వచ్చేప్పుడు వాళ్ళూరి లో దిగేదాకా వదల్లేదు . సాయంత్రం వెలుదువుగాని అని ఒప్పించి వెళ్ళాక నాలుగు రోజులకి గాని పంపలేదు.


వాళ్ళిద్దరూ ఉద్యోగం ఒక్కటి కాకుండా ఇంత  కష్ట పడి పదో పరకో జీతానికి తోడూ సంపాదిస్తూ ఉంటే ఇంకా ఒకరి గురించి చెడ్డగా మాట్లాడుకోడానికి తీరికెక్కడ . అలాంటి అంకుల్ రెండేళ్ళ తర్వాత అమ్మతో అలా వాళ్ళమ్మాయి గురించి చెప్పడం నాకు అస్సలు నచ్చలేదు . అంత కోపం రావడానికి ఇంకో కారణం కూడా ఉంది . అసలు ప్రవీణ నేను దూరంగా ఉండడానికి అసలు కారణమే తను ఎప్పుడూ వాళ్ళ నాన్న కి నచ్చినట్లు ఉండడమే . అలాంటిది ఆయనే కూతురిని ఇలా తక్కువ చెయ్యడమా .

సరే నేను పెట్టిన వారం రోజులు సెలవ్ అయిపోవడంతో మళ్ళీ బెంగుళూరు వెళ్ళిపోయాను . ఆ వాళ ఎలాను లేట్ అయ్యింది ఆఫ్ఫీస్లోనే డిన్నర్ చేసి వెళదాం అని డిసైడ్ అయ్యాము . అలా కాస్సేపు కాంపస్ లో చక్కర్లు కొట్టి కాంటీన్ కి వెళ్దాం అని  నడుస్తూ ఉండగా ఒకబ్బాయి ఇంకెవరితోనో మాట్లాడుతూ కనిపించాడు. పట్టరాని సంతోషం వేసింది , వెనగ్గా వెళ్లి ఫోన్ తో వీపు పై దేబ్బెసాను , తనూ వెనక్కి తిరిగి చూసి  మొహం మతాబులా వెలిగించేసాడు . తను ఎవరో కాదు ప్రవీణ రెండో తమ్ముడు రమేష్  , ఎమ్సియ్యే కి ప్రిపేర్ అవుతుండగా చివరిసారి కలవడం . ముగ్గురు తమ్ముళ్ళ లో రమేష్ తో కాస్త ఎక్కువ అభిమానం. నువ్వేంటి ఇక్కడ అని ఇద్దరం ఒకరిని ఒకరు పలకరించేసుకోన్నాక అక్కయ్యదగ్గరే ఉంటున్నా అని , ఇంటికి రమ్మని గొడవ చేసాడు . ఉహూ , వాళ్ళక్క అంటే నాకు కోపం ఇంకా అలానే ఉంది .  మా అక్క ఇప్పుడు పూర్తిగా మారిపోయింది . తెగ ఖర్చు పెట్టేస్తుంది అని చెప్పినా అబ్బే మనం తగ్గలేదు . సంతోషంగా ఫోన్ నెంబర్ లు  అయితే ఇచ్చి పుచ్చుకున్నాం.


ఒక రెండు నెలల తర్వాత రమేష్ వాళ్ళ టీం  మెంబర్ కన్పిస్తే  మాటల్లో ఆ   పూనే ట్రాన్స్ఫర్ చెయ్యించుకొన్నాడు  అని తెల్సింది . అయ్యో అని వెంటనే నంబర్ తీసికొని కాల్ చేసాను. మళ్లీ  అదే కంప్లైంట్ అక్కని కలవలేదు ఇంకా అని పోట్లాడేసాడు . బాబు నేను వెళ్ళలేను కాని నంబర్ ఇవ్వు మాట్లాడుతాను అని చెప్పాను. అలా ప్రవీణ కి చివరికి తప్పదని ఫోన్ చేసాను . ఆ పిల్లేమో కాస్తకూడా మాట్లాడకుండా నువ్వు ముందు వస్తావలేదా చెప్పమంది . తన క్లాస్మేట్ మా ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నాడు తను తీసికొని వస్తాడు , అని నాకు మాట్లాడే చాన్స్ ఇవ్వకుండా అతన్ని మా బ్లాక్ కి పంపించింది .


సరే తర్వాతి  రోజు తన బర్త్ డే కూడా కదా మూవీ కి వెళ్దాం అని ప్లాన్ చేసికొన్నాం . వాళ్ళాయన విదేశంలో ఉండడం బాగా కలిసొచ్చింది . ఆ చుట్టూ పక్కల ఉన్న ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సరదాగా గడిచిపొయ్యాయి . అందరు వెళ్ళాక అసలు మాట్లాడినట్లే లేదు అని సోమవారం కూడా సెలవు పెట్టి అక్కడే ఉన్నాను .  ఉన్నానే కాని నేను అంకుల్  మాటలకి కోపం వచ్చి ఆయన్ని చెడామడా తిట్టడం నా బుర్రను వదలడం లేదు . తనకి వాళ్ళ నాన్న అంటే  ఎంతిష్టమో తెలుసు , అలాంటిది నేనలా అనేసి ఈ పిల్లతో మామూలుగా ఉండడం ఇబ్బంది అయ్యింది అలా అని నేను ఊరికే అనలేదు కదా. తనగురించి వాళ్ళ నాన్న అలా చెప్పారని చెప్పలేను కాని . నాకు  వచ్చిన కోపం అలాంటిది . అదే సమయం లో వాళ్ళ నాన్న గురించి అలా మాట్లాడి తనతో మామూలుగా ఉండడం బాలేదు .  అందుకే నెమ్మదిగా సారీ చెప్పి ఇలా జరిగింది , నాకు నచ్చక మీ డాడీ గురించి కోపంగా మాట్లాడాను అని అతి కష్టం మీద చెప్పాను . చిత్రం గా నేననుకొన్నట్లు తను నా పై కోప్పడలేదు . వదిలేయ్ మౌళీ , చాలా జరిగింది. ఇన్నాళ్ళు పెంచారు .  ఇంత  మంచి జీవితం ఇచ్చారు అందుకే వాల్లనేమి అనొద్దు అనుకున్నాను  అంది . మొదట గట్టిగా ఊపిరిపీల్చుకోన్నాను అమ్మయ్య నేను పొరపాటు చెయ్యలేదు అప్పుడు ఇప్పుడు  అని . అసలేం జరిగింది అని అడగకుండా ఉండలేకపోయాను .  తను చెప్తూ ఉంటె నాకసలు మెదడు మొద్దుబారిపోయింది . అవునా అని తప్ప ఇంకేం అనలేని సంఘటనలు  .

( మిగిలినది తర్వాతి భాగం లో ..)

ఈ  టపా సెరిస్ ప్రవీణ వాళ్ళ అమ్మ , ఆత్తయ్య లను స్త్రీవాద కోణం లో వివరించే ప్రయత్నం . )

28, ఏప్రిల్ 2013, ఆదివారం

కెమెరామెన్ గంగ తో రాంబాబు - జగన్ కధ

పూరీ జగన్ దర్శకత్వం  వహించిన సిన్మా జగన్ కధ కాక త్రివిక్రమ్ కధ  అవుతుందా  అని అనుమానం వచ్చిందా మీకు?  అయితే మీకు జ్ఞాన పీఠం  వచ్చేసినట్లే .

వై ఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫ్లైట్ ఆక్సిడెంట్ లో మరణించిన కొద్ది రోజులకే ఆయన పై సినిమా ని పూరి జగన్ దర్సకత్వం లో ప్లాన్ చేసినట్లుగా హడావిడి చేశారు . మొత్తానికి ముహూర్తం పెట్టడమే తరవాయి అని ప్రచారం కూడా జరిగింది . అప్పట్లో కాస్త దర్శకుడికి సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ కోసం తయారు చేసుకొన్న ముడిసరుకు అలా ఉండిపోయి ఉంటుంది . అదే  కెమెరామెన్ గంగ తో రాంబాబు కి మూల కధ అనుకోవచ్చు. సినిమా చూస్తున్నంత సేపు పూరీ జగన్ వై ఎస్ కుటుంబ అభిమాని కాదా అని బోలెడు ఆశ్చర్యం వేసింది. కేవలం దర్శకుడిగా మాత్రమె కొడుకు జగన్ కి సిన్మా చేస్తానన్నాడా?

గబ్బర్సింగ్ చూసాక పవన్ సిన్మాలంటే చిరాకేసింది . అందుకే ఇప్పటి వరకు ఈ సిన్మా వైపు కూడా చూడలేదు .కాని మన తిరుట్టు వెబ్ సైట్ లో ఇంతకూ మించిన సిన్మా దొరక్క చూడాల్సి వచ్చింది .  ఒకేసారి చూడ్డం  కాస్త కష్టం ఏమో. అదీ కాక ఎంటర్తైన్మెంట్ కోసం సిన్మా అంటే ఇది నచ్చకపోవచ్చు . నాకు మాత్రం చాలా నచ్చింది . మొత్తం పూరిజగను విశ్వరూపం చూపించేసాడు, డైలాగ్స్ వ్రాయడం లోను అవి ఆయా పాత్రలతో చెప్పించడం తోనూ.

సిన్మా లో రాజకీయ పాత్రల పేర్లు చూసి చంద్రబాబు నాయుడు కధలో ఉన్నాడను కొంటే  మళ్ళీ పప్పులో కాలేసినట్లే.
రెడ్డి పేరు పెట్టినంత మాత్రాన , పాద యాత్ర చేసినంత మాత్రం తో ముఖ్య మంత్రి గా వై ఎస్ ని, కేవలం నాయుడు అన్న పేరుతొ ప్రతి పక్ష నాయకుడిని ఊహించుకోవడం చాలా హాస్యాస్పదం . రెండు టర్మ్స్ ముఖ్యమంత్రిగా చేసింది కేవలం చంద్రబాబే కాదు , వై ఎస్ కూడా :)

ఇంతకీ చెప్పొచ్చేదేమంటే అక్కడ నాయకుడు, ప్రతినాయకుడు ఒకే వ్యక్తి కధ  నుండి వచ్చారు . ఇద్దరూ వై ఎస్ గారి కధలోని రెండు కోణాలు .  సమకాలీన రాజకీయ అంశాలు సినిమా కధగా పెట్టినపుడు కాస్త కాచీ గా ఉండే పేర్లు వాడడం , అదీ డైరెక్టు ఇది పలానా ముఖ్యమంత్రి పాత్ర అని స్పష్టంగా అర్ధం కాకుండా ఉండేందుకు పూరి జగన్ చేసిన ప్రయోగం చక్కగా ఫలించింది. ఇంకా తండ్రి చనిపోక ముందే కొడుకు జైలు సీన్ రావడం ముఖ్య మంత్రి అయిపోతాడు అని ప్రచారం జరగడం అలా మనకి తెలిసిన వరుసలో కాకున్నా జగన్ రాజకీయ జీవిత ఘట్టాలన్నీ మనకళ్ళముందు జరిగిపోతూ ఉంటాయి . మనం ఊహించని మలుపులు తో ఆశ్చర్య పరుస్తాయి . ఒక సారి తెలుగు తల్లి ఇంటర్వ్యూ  తోనూ , ఇంకొకసారి టీవీ లో ఆవేశపూరిత  ఉపన్యాసంతో జనం అందరినీ కదిలించడం చాలా బావున్నాయి 

రాజకీయం పక్కన పెడితే , మనోభావాలు దెబ్బ తీసుకొనే ప్రేక్షకులకొసమ్ గుడ్డి వారి పై వేసిన సెటైర్ అదుర్స్. ఇంకా సిన్మా ను వెయ్యిప్రింట్లు వేసి హడావిడిగా డబ్బు చేసికొంటున్న నిర్మాతల్నీ వదల్లేదు . ఇక బ్రహ్మానందం పాత్ర నయితే చాలా ఎంజాయ్ చెయ్యొచ్చు .  తమన్నా మొదటి సారి అమ్మాయిగా నటించింది , అందాల బొమ్మ  గా కాకుండా . తను ఎలాంటి అమ్మాయో చెప్పడం సరదాగా ఉంటుంది . ఆర్డినరీ అమ్మాయిల గురించి  దర్శక జగన్ మాటలు పవన్ డైలాగులలో  చక్కగా పేలాయి .

సుజాత గారు దేశభక్తి సిన్మాల పై వ్రాసిన ఎఫ్ఫెక్ట్ ఈ రాష్ట్ర భక్తి  సినిమా  రివ్యు  నేను వ్రాస్తే వస్తుందా , అయినా పర్లేదు సిన్మా నాకు బాగా నచ్చింది  ఽది పంచుకోవడానికే ఈ బుల్లి టపా అన్నమాట. అవార్డ్ రావాల్సిన సిన్మా , నేను బాగుంది అన్నాక ఏ సిన్మా అయినా ఆడిందా అని అసలు :) ఒక ఆరెంజ్ , ఒక మొగుడు, ఒక కెమెరామెన్ :)  పబ్లిక్ కి నచ్చవ్  :)







18, ఏప్రిల్ 2013, గురువారం

ఆసియా లోని అత్యంత ప్రభావశీలురు వీరేనా


ఈనాడుకి ఈ మధ్య సోనియా పై ప్రేమ ఎక్కువయ్యిన్ది. నకిలీ కణికులా మజాకా :) అబ్బే కాదులే జగన్మాయేమో .   అప్పట్లో చంద్రబాబుగురించి ఇలా అంతర్జాతీయ నంబర్ల హడావిడి జరిగెది.  తర్వాత వార్తల్లో కనిపించడం మానేసాడు. ఇప్పుడు మన్మోహనుకో , సోనియాకో ఎదురు దెబ్బ తగలదు కదా.  వివరాల్లోకి వెళ్తే ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురైన 100 మంది ఆసియన్లలో మొదటి అయిదు మంది లో సోనియా, మన్మోహనూ మరియు రాహులూ రెండవ, నాల్గవ, అయిదవస్తానాల్లో నిలిచారు. సోనియా తల్లి ప్రేమ యెంత గొప్పది, తన పేరోక్కటి కాకుండా కొడుకు కి కూడా ఇప్పిస్తూ అనుమానం రాకుండా ఆటలో అరటి పండు లా మన్మోహనుక్కూడా ఉదారంగా వేయించేశారు.

ఏమాటకామాటే  చెప్పుకొవాలి. ఒక దశాబ్దం క్రిందట జనాలకి ఈ సోనియా పిచ్చేమిటో అర్ధం అయ్యేది కాదు. అందంగా , ఇంత  పెద్ద బొట్టు పెట్టుకొని  పట్టుచీరకట్టుకొఛ్చిన సుష్మా స్వరాజ్ ని వదిలేసి ఈ బళ్లారోళ్ళు సోనియాని గెలిపించేడం  అస్సలు జీర్ణం కాలేదంటే నమ్మండి .అయినా అదే  సుష్మా స్వరాజ్ గుండు కొట్టిన్చుకోకుండా ప్రధాని పదవిని త్యాగం చేసి  భారతీయ సంప్రదాయాన్ని కాపాడింది అనుకోండి.  ఇప్పుడయితే ఆంద్ర, తెలంగాణా లో ఎక్కడ అయినా గెలిచేస్తుంది అని అర్ధం అయ్యిన్దనుకోండి.

గత పదిహేను, ఇరవై  సంవత్సరాలుగా ఒక మహిళ కేవలం కుటుంబ వారసత్వం వాళ్ళ అయితేనేమి ఇంత పట్టును కలిగి ఉండడం, ఎప్పటికప్పుడు వ్యూహాలు, నిర్ణయాలు ఏర్పరుచుకొని ముందుకి సాగడం మామూలు సంగతి కాదు. ఎవరికేం కావాలో అర్ధం చేసికొని మసులుతూ ఉండడము, అవసరం అయితే కన్నెర్ర చెయ్యడంకూడా తెలుసనీ చెప్పకనే చెప్పింది. ఇంత  పెద్ద ప్రజాస్వామ్యాన్ని తన కనుసన్నలలో నడిపిస్తున్న మహిళా అంటే అంతర్జాతీయ రాజకీయాలు, మార్కెట్ లో యెంత ప్రాముఖ్యతను కలిగి ఉండాలి ? ఆవిడ ఏ ఉద్దేశ్యంతో గాంధి కుటుంబం లో అడుగు పెట్టిందో ఇన్ని సంవత్సరాల తర్వాత చర్చించడం అనవసరం. అంతకు మించిన నాయకత్వం మనకి లేదు అన్నది నిజమ్. 

ప్రస్తుతానికి ఆసియాలో ను, ప్రపంచం లోను అత్యంత గుర్తింపు సోనియాకి లభించడం ఆనంద దాయకమే.  

10, ఏప్రిల్ 2013, బుధవారం

ఇందిరమ్మ హస్తం

అబ్బ పది రోజులనుండి నాకు ఎంత మంచి అయిడియా వచ్చిందో అని మురిసిపొతున్నాను.  ఆచరణలో పెట్టె సమయం కోసం ఎదురు చూపులు కూడా మొదలు పెట్టే సానూ . ఇంతలోనే ఇవ్వాళ వార్త . కాంగ్రెస్ పార్టీ నా ఐడియాని కాపి కొట్టెయ్యడానికి సిద్దమై పోతున్నది . ఇప్పుడు నేనేం చెయ్యాలి. గత పన్నెండు నెలలనుండి ఇరవై ముప్పై ఆలోచనల్లోనుంచి కుదిరేపనిగా ఉందని ఇది ఒక్కటి చేద్దాం అనుకుంటే , వీళ్ళు నా ఆశల పై కళ్ళాపి  చల్లుతున్నారు.  అయినా చూద్దాం  ఎవరు ముందు మొదలు పెట్టేస్తారో .

అసలు విషయానికి వస్తే , నాకు తెలిసిన నాలుగు కుటుంబాలు, ప్రస్తుతానికి ఆడవాళ్లే మిగిలి ఉన్నారు . వాళ్లూ ఎన్నాళ్ళు పనిచెస్తారు. కొద్ది గొప్ప వ్యవసాయానుకూలమైన భూములు ఉన్నా వచ్చే కవులు జాగ్రత్తగా ఖర్చుపెట్టుకుంటూ, రోజు ఏదో పనిలో తమని తాము బిజీగా ఉంచుకుంటూ ఉన్నారు. ఇదంతా అనడరికీ మామూలే .
కాని ఆడవాళ్ళు ఇంతవయస్సులోను బజారుకి వెళ్లి కిరాణా సామాన్లు తెచ్చుకోవాల్సి రావడం మాత్రం చాలా కష్టం గా ఉంటుంది. చిన్నపిల్లలుగా వెళ్ళడం వేరు. కనీసం నెలకోసారి పట్టీ కట్టించుకొనే ఆలోచనకుడా ఇబ్బందే , ఒకేసారి ఖర్చు కి మనసొప్పదు. అందుకే ప్రతినెలా వారికి కావాల్సిన వస్తువులు పట్టీ తయారు చేసి అంతవరకూ జాగ్రత్తగా అందేలా చేస్తే, వాళ్ళు బయటికి వెళ్లి ఎండా, వానల్లో కష్ట పడకుండా ఇంటిదగ్గరే ఉంది చెయ్యగలిగిన పనులు చేస్తూ ఇంకాస్త ఉన్నన్నాళ్ళు మెరుగైన జీవనం గడపగలరు అని . ఎక్కువమందికి ఇవ్వలేము కాని ఇంకెవరూ లేనివారికి ఇంతకూ మించి పరిష్కారం మన చేతుల్లో లెదు.


ఇప్పుడే ఈనాడు లో న్యూస్ ఐటెం 'అమ్మ హస్తం ' పేరు తో 9 నిత్యావసర వస్తువుల పధకం ప్రకిటించే ప్రయత్నం గురించి ఉంది . నాకయితే బాగా నచ్చింది.  ఈ పధకాల వల్ల , ప్రజాధనం యెంత ఖర్చు అవుతుంది, మధ్యలో ఎవరి వాటా యెంత అన్న గొడవ కన్నా, చాలా మందికి కనీస నిత్యావసరాలు కాస్త తక్కువ ధరకు అందుతాయి

మళ్ళీ కాంగ్రెస్ అధికారం లోకి రావడానికి, వై ఎస్ లానే ఇంకాస్త మెరుగైన పధకాలు జనం లోకి తీసికెల్ల డానికి బానే కష్ట పడుతోంది . బాబుకి అయితే ఇప్పట్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాసం లెదు. మిగిలింది నలుగురినీ కలుపుకుపోయేది కాంగ్రెస్స్ ఒకటే ( అంటే చిరంజీవినీ, నాగార్జునా, మహేష్ బాబునీ అని కాదండోయ్ )


కిరణ్కుమార్ ఇప్పటిదాకా పదవిలో  ఉండడమే విశేషం , చూద్దాం ఆయన అదృష్టం ఎలా ఉందొ !

8, ఏప్రిల్ 2013, సోమవారం

సినిమాలు, బాంబుదాడులు, ముస్లిమ్స్, జస్టిస్ కట్జూ , ఎన్టీఆర్



ఈనాడు పేపర్ అలవాటయ్యాక ఇంకో పేపర్ అస్సలు నచ్చదనుకుంటా. అందుకే కాస్త టైమ్పాస్ కి న్యూస్ చూడాలి అంటే వేళ్ళు  అలవోకగా ఈనాడు. నెట్  అని వెళ్ళిపోతాయి. ఒక్కటే సమస్య ఏదన్నా న్యూస్ పంచుకొందామంటే అక్కడినుండి బ్లాగులోకి అంట తేలిగ్గా రాదు.

ఏదేమైనా ఒక మంచి వార్త చూసాను, చూడగానే అబ్బో ఇలాంటి వార్తలు కూడా ప్రచురిస్తున్నారా అని ఆశ్చర్యం వేసిందంటే మరి అంత  ఘాటుగా ఉంది.  ఈ మధ్య పాత జడ్జీలు కూడా ఇష్టం వచ్చినట్లు సంజయ్ దత్ కి బెయిలివ్వాలనీ, ఇంకేదో పనికోమాలిన స్టేట్మెంట్ లు ఇస్తుంటే ఈ జస్టిస్ కట్జూ గారేమో మంచి ఆసక్తికరమైన వ్యాఖ్యానం  చేసారు. ఈయన ఇంతకూ ముందు కూడా ఇలానే బుద్దిగా మాట్లాదేరో లేదో ఒకసారి చెక్ చేద్దాం అంటే బద్ధకం వేసి ఇప్పటికిలా కానిచ్చెస్తున్నా. మీకు తెలిస్తే మాత్రం చెప్పండే

మొత్తానికి చాన్నాళ్ళ తర్వాత ఇ లాంటి వ్యాఖ్యలు చూసాను. ఏంటో జీవితం దేనికైనా రెడీ సిన్మా చూసాము అని చెప్పాలంటే ఒక తెలిసిన ఫామిలీ కక్ష పెట్టుకుంటుందేమో అనుమానమ్.  నా ఇంకో ప్రియనేస్తం ముస్లిం. పనికిరాని  సినిమాల  సంగతి సరే. వాళ్లకి తెలుగు  సినిమాలతో పనిలేదు.  హైదరాబాదులో బాంబులు అనగానే అమ్మయ్య తను తెలుగు న్యూస్ చానెల్స్ ఏమి  చూడరు కాబట్టి  పర్వాలేదు. అయినా  చిన్న అసంతృప్తి . నేను చూసినంత లో మిగిలిన అందరికన్నా ముస్లిమ్స్ బహు సౌమ్యులు.  ఇంత మందిలో ఒక్కరుకూడా తొందరపడి మాట్లాడినవారిని  చూడలేదు. కాని ఏ సంఘటన జరిగినా వాళ్ళ గురించి మాట్లాడ్డం , ఇవేవి వారికి మంచివాళ్ళ మీద ఉన్న నమ్మకాన్ని పోగట్టలేదు.


జస్టిస్ కట్జూ మనదేశంలో ఎనభై శాతం మంది ఇరువైపులా మతోన్మాదులే అన్నారు. ముస్లిమ్స్ లో ఎనభై శాతం అంటే మన ఎనభై శాతంలో ఎన్నో వంతో తెలియదు. బ్లాగ్స్ ఆయన మాటలు నిజమని రోజూ నిరుపిస్తున్నాయి.

బ్లాగ్ లే కాదు. ఆ మధ్య మాకు పరిచితులైన ఒక కుటుంబం తో సరదాగా బయటికి వెళ్ళాము ట్రిప్ కి.  తనే ఏదో మాటల్లో తనకు బేధాలు లేవనీ, ఇంకా తను హాస్టల్లో అందరితో ఎలా కలిసి ఉంది చెపుతూ మౌలీ నువ్వు తినే ఎంగిలి  స్పూన్ తో నేను తినేస్తాను అస్సలు ఫీల్ అవ్వను, కాని తర్వాత అదే స్పూన్ నువ్వు ఉప్యొగిస్తావొ లేదో నాకనవసరం అనేసారావిడ. స్పూన్ తో కులాల అంతరాలను చీల్చి వేసిన ఆవిడ ఫిలాసఫీ బొత్తిగా అర్ధం కాకపోయినా , తినను అని అలా చెప్పెయ్యకుండా నవ్వి ఊరుకున్నా .

తర్వాత రోజు సరదాగా బుఫే కి వెళ్ళాము రెండు కుటుంబాలు కలిసి. నా అదృష్టం ఎప్పటిలానే , గ్రూప్ లో నేనొక్కర్తినే. నాన్వెజ్ అయ్యాను.  ఇంట్లో అసలే చెయ్యను , వారం నుండి వీల్లున్నారని హాయిగా వెజ్జే వండుకున్నా, బయటికి వచ్చాక కూడానా . అలా సంభాషణ నాన్వెజ్ లోకి వచ్చిన్ది. మళ్ళీ తనే అన్నది వాళ్ళబ్బాయి కి స్కూల్లో కుకింగ్ క్లాసెస్ లో పార్టనర్ గా ముస్లిం అమ్మాయి వచ్చిందని తెలిసి ఇదేం చండాలం రా నీకు ముస్లిమ్ అమ్మాయి రావడం ఏంటీ అని అన్నాను , లేదులే వెజిటేరియన్ నే ప్రిపేర్ చేసాం ఇద్దరం అని చెప్పాడట వాళ్ళ బాబు.  నాకయితె ఆ మాటకి  కి దిమ్మ తిరిగిపోయింది . అర్ధం కాక అడిగితె మా వారు చెప్పారు..  ముస్లిమ్స్ స్కూల్లో కాని, బయట కాని నాన్వెజ్ తినరట, కాబట్టి ఆ అమ్మాయి కూడా వేజ్జే లాజికల్గా అని. షాక్ ని కవర్ చేసికొంటూ పిల్లల్ని బయట తినవద్దు అనడం ఎందుకు అని వేరే మాట మార్చెసాను. పాపం వాళ్ళాయన అదీ హైజీన్ కాదు హలాల్ చెయ్యని మాంసం, వాళ్ళు తినకపోవడం మంచిదే అని ఆయనా కవర్ చెసారు.

తర్వాత రోజు వాళ్ళు వెళ్ళినా, ఆ మాటలు కష్ట పెడుతూనే ఉన్నాయి.  నిజానికి మనం కాని, మిగిలిన వాళ్ళతో కాని అవసరం కోసం మాత్రమె వీళ్ళు కలిసి ఉన్నారు కాని నిజంగా సంకుచిత మనుష్యులు కదా అంటే , పట్టించుకోకు వదిలేయ్ అన్నారు . అప్పటికి కాని అర్ధం కాలేదు , దగ్గరలోనే ఉన్న ప్రియ నేస్తానికి పలానా తెలుగు వాళ్ళు  వస్తున్నారు,  పిల్లలకి టైమ్పాస్ అవుతుంది రండి అని అడిగినా  కాదు అనకుండా తను అన్ని రోజులు తప్పించుకుంది ఇలాంటి వారిని చూసేనా . తెలిస్తే తనకి చెప్పక పొదును.

మనది హిందూ దేశమా , లౌకిక దేశమా అన్నది నాకు అవసరం లేదు.. మన మధ్య ఉన్నవారి గురించి పిల్లల మనస్సుల్లో విషాన్ని నూరి పొయ్యడం అమానుషం , అలాంటివారు ఎవరైనా వారి పిల్లలకు  చె డుమార్గం ని బోధిస్తున్నట్లే.  అదీ మాటర్

ఇక ఇంకో న్యూస్  ఎన్టీఆర్ ఫోటో గురించి హడావుడి, దానిపై బ్లాగుల్లో కూడా చర్చ అవసరమా? అసలాయన చనిపోయఎనాటి కి ఏ పార్టీ అయితే వాళ్ళు మాట్లాడినా అర్ధం ఉంది. హరికృష్ణ సరిగ్గా సమాధానం చెప్పాదు. రామారావు జనం మనిషి ఎవరయినా బొమ్మ పెట్టుకోవచ్చు అని .  అన్ని పార్టీలకు విస్తరించిన ఏకైక ప్రాంతీయ నాయకుడిగా గిన్నీసు లో వ్రాయోచ్చేమో . అందుకే ఒకసారి జాతీయ పార్టీ లో  గాంధీ, నెహ్రు లేమన్నా ఈ ఖ్యాతి గడించారేమో చూసి లేకపోతె ఏకమొత్తంగా దేశంలోనే పెద్దాయన్ని ఏకైక వ్యక్తిగా ప్రకటించేద్దాము . లేదంటే దేశం లో ఇంకేవరినా ఉంటె మీరే చెప్పాలి మరి.